దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయుల అరెస్టు

దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్‌ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు.

Published : 06 May 2024 05:06 IST

అగర్తలా: దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్‌ పౌరులను త్రిపురలో అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. వారంతా నెల క్రితం బెంగళూరుకు వచ్చారని, త్రిపురలోని గండచెర్రా ప్రాంతం గుండా తిరిగి బంగ్లాదేశ్‌ వెళ్తుండగా పక్కా సమాచారంతో శనివారం వారిని ఆదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని