
హిమపాతంలో చిక్కుకున్న పౌరుల్ని కాపాడిన సైన్యం
శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో భారీ హిమపాతం కారణంగా చిక్కుకున్న ఘటనల్లో దాదాపు 30 మంది పౌరులను సైనికులు సురక్షితంగా కాపాడారు. సోమవారం తంగ్ధర్-చౌకీబాల్ ప్రాంతంలో ఓ వాహనం చిక్కుకుపోయిందని.. వెంటనే ఆర్మీ యూనిట్ను అప్రమత్తం చేసి సహాయక చర్యలు ప్రారంభించినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. వాహనంపై మంచు దిబ్బలు పడకముందే అందులో నుంచి దిగి ప్రాణాలు కాపాడుకున్నట్లు బాధిత పౌరులు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.