కొత్తగా 18,738 మందికి కొవిడ్‌

దేశంలో కొవిడ్‌-19 కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా (శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం 8 గంటల వరకు) కొత్తగా 18,738 మందికి వైరస్‌ సోకింది. అంతకుముందు రోజు ఈ సంఖ్య 19,406గా నమోదైంది. మరోవైపు, కరోనాతో

Published : 08 Aug 2022 05:45 IST

1,34,933కు చేరిన క్రియాశీలక కేసులు

దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా (శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం 8 గంటల వరకు) కొత్తగా 18,738 మందికి వైరస్‌ సోకింది. అంతకుముందు రోజు ఈ సంఖ్య 19,406గా నమోదైంది. మరోవైపు, కరోనాతో పోరాడుతూ 40 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 4,41,45,732కు, మొత్తం మరణాల సంఖ్య 5,26,689కి చేరింది. క్రియాశీలక కేసుల సంఖ్య 1,34,933కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. రోజువారీ పాజిటివీటీ రేటు 5.02గా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని