మోదీజీ.. మీరు పునాది వేసిన అమరావతి ఇప్పుడిలా!
‘‘హైదరాబాద్ని మించిన మహానగరాన్ని కడతాం. కేంద్రం సహాయం చేసినా, చేయకపోయినా నిర్మించితీరతాం. ఎలా అంటే మా బుర్రలోంచి వచ్చిన ఆలోచన నుంచి కడతాం’’- ఇవి జగన్ ప్రతిపక్షంలో ఉండగా పలికిన అబద్ధాలివి.
వికేంద్రీకరణ పేరిట జగన్ విద్వేషం
పదేళ్లయినా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రావని
భూములిచ్చిన రైతుల అరణ్యరోదన
చంద్రబాబుపై అక్కసుతో రూ.వేలకోట్లు నీటిపాలు
ఈనాడు, అమరావతి
ప్రధానమంత్రి గారూ..
గుర్తుపట్టారా....?
అమరేంద్రపురిలా ఎదగాలని ఆకాంక్షిస్తూ...
మీరు శంకుస్థాపన చేసిన అమరావతిని!
పదేళ్ల కిందట...
ఆంధ్రుల ఆశల భౌతిక రూపంగా...
కలలు పండించే సౌభాగ్య నగరిగా ఎదగాలని ఆకాంక్షిస్తూ... పవిత్ర నదీ జలాలను, మృత్తికను అందజేస్తూ... వీరు చెప్పిన సంకల్ప వచనాలు
గుర్తుండే ఉంటాయి...
నవ రాజధాని నిర్మాణంతో ఈ మట్టి రత్నగర్భ అవుతుందని,
సంపద సృష్టికి కేంద్రమవుతుందని
యువత కలలు పండించే మాగాణి అవుతుందని
ఐదుకోట్ల ఆంధ్రులూ ఆశించారు!
అన్నదాతలు ముందుకొచ్చి మూడు పంటలు పండే భూములిచ్చారు
దేశవిదేశాల్లోని కంపెనీలూ రావడం మొదలెట్టాయ్
అమృత, ఎస్ఆర్ఎం, విట్లాంటి
విద్యాసంస్థలూ వచ్చాయ్
ఒక్కో ఇటుక పేర్చుకుంటూ...
సౌధాలు తలెత్తుకుంటూ...
అభివృద్ధి డిజైన్లు ఒక్కటొక్కటిగా
పట్టాలకెక్కుతున్న వేళ...
ఒక్క అవకాశమంటూ...
వచ్చాడో మాయల మరాఠీ...
ద్వేషంతో...కుట్రలతో.. వంచనతో...
మూడు రాజధానుల మాటలతో
నిర్మాణాలకు గండికొట్టాడు
మీరు మొదలెట్టిన యజ్ఞాన్ని భగ్నం చేశాడు
ఓ అద్భుత అవకాశాన్ని కాలరాశాడు.
భూములిచ్చిన రైతులకు కన్నీరు మిగిల్చాడు...
ఇప్పుడు...
ఎటు చూసినా శిధిల జ్ఞాపకాలతో
మధ్యలో ఆగిపోయిన మహా యాగశాలలా
నిలిచిపోయా!
‘వికసిత రాజధాని’గా ఎదగాల్సినదాన్ని
విచలితమైపోయా!
విధ్వంసానికి ప్రతీకగా మిగిలిపోయా!
చూడండి ఒకసారి.. మా గోడు వినండి!
‘అమరావతి’పై వ్యతిరేకత లేదని బొంకి...
నా ఇల్లూ ఇక్కడే అని నమ్మించె..
అధికారం రాగానే మాట మార్చి...
వికేంద్రీకరణంటూ విద్వేషపు విషబీజాలు నాటె
ప్రజాధనంతో మొదలెట్టిన అభివృద్ధిని
పునాదుల్లోనే భూస్థాపితం చేయాలని తపించె...
వద్దన్న మట్టిమనుషుల పోరాట స్ఫూర్తిని...
పంతానికి పోయి పతనం చేయజూసె...
దండంపెట్టిన దళితులే... దండుగా కదిలితే
పోలీసులతో తొక్కించె...
హలం పట్టే చేతులే.. ఆగ్రహిస్తే..
అధికార అహంతో అణిచివేసె...
భూములిచ్చిన రైతుల వ్యధలు చూసి భూతల్లే విలవిల్లాడిన వేళ...
ఆంధ్రావని కలల సౌధాన్ని...
రాష్ట్ర రూపురేఖలు మార్చే రాజధానిని...
యువత ఉపాధికి ఊతమిచ్చే యంత్రాన్ని...
పాతాళానికి నొక్కాలని చూసిన పాపి జగన్!
నాడు... కంసమామ
చిన్నికృష్ణున్ని చిదిమేయటానికి
ఎన్ని ప్రయత్నాలు చేశాడో....
నేడు...
మామ మామ అంటూ జగన్
ఆంధ్రుల కలల సౌధం అమరావతిని
నాశనం చేయటానికి అన్ని ఎత్తులూ వేశాడు!
‘‘హైదరాబాద్ని మించిన మహానగరాన్ని కడతాం. కేంద్రం సహాయం చేసినా, చేయకపోయినా నిర్మించితీరతాం. ఎలా అంటే మా బుర్రలోంచి వచ్చిన ఆలోచన నుంచి కడతాం’’- ఇవి జగన్ ప్రతిపక్షంలో ఉండగా పలికిన అబద్ధాలివి. గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని నిర్మాణం తమకు సమ్మతమేనని ఎన్నికల ముందు జగన్ నమ్మబలికారు. అమరావతిలోనే రాజధాని నిర్మిస్తామని అందుకే ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నానని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక నాలుక మడతబెట్టారు. మూడు రాజధానుల పేరుతో కొత్త నాటకానికి తెరతీసి, అమరావతిని ధ్వంసం చేశారు. గత తెదేపా ప్రభుత్వం ఎంత బృహత్ సంకల్పంతో అమరావతి ప్రాజెక్టుని పరుగులు పెట్టించిందో... జగన్ ప్రభుత్వం అంతే పట్టుదలతో అమరావతి విధ్వంసాన్ని కొనసాగించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిపేసింది. రాజధాని నిర్మాణానికి రూ.7,206 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ప్రపంచబ్యాంకుని, రాజధానిలో స్టార్టప్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టేందుకు అంతా సిద్ధం చేసుకున్న సింగపూర్కి చెందిన ప్రఖ్యాత సంస్థలను, పెట్టుబడిదారులను తరిమికొట్టింది. మూడు రాజధానులను తెరపైకి తెచ్చి... శాసన రాజధాని పేరుతో అమరావతిలో కేవలం 100 మంది ఉద్యోగులుండే...ఏడాది మొత్తం మీద 10-15 రోజులు సమావేశాలు జరిగే శాసనసభ భవనాన్ని మాత్రమే ఉంచి... హైకోర్టుని కర్నూలుకి, మొత్తం పాలనను విశాఖకు తరలించేందుకు కుట్ర పన్నింది. విస్తరిలో నవకాయ పిండివంటలు వడ్డించుకుని తినేందుకు సిద్ధమవుతుండగా ఒక అసూయాపరుడు వచ్చి కాలదన్నితే ఎలా ఉంటుందో... ఇప్పుడు అమరావతి పరిస్థితి అలాగే ఉంది..! భూమి, ప్రణాళికలు, వనరులు అంతా సిద్ధం చేసుకుని నిర్మాణాలు మొదలు పెట్టి వేగంగా కొనసాగిస్తున్న దశలో అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతిపై కక్షగట్టారు.
వైకాపా విధ్వంసంతో తీవ్ర నష్టం..!
అమరావతిపై జగన్ ప్రభుత్వం కక్షగట్టి విధ్వంసానికి పాల్పడటంతో... రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇదీ మా రాజధాని నగరం అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు. అమరావతి వినాశనానికి జగన్ కంకణం కట్టుకోవడం వల్ల... అటు రాజధానితో పాటు, మొత్తం ఆంధ్రప్రదేశ్కే పెట్టుబడులు రాలేదు. రూ.లక్షల కోట్ల సంపద ఆవిరైంది. చదువుకున్న యువత ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు తరలిపోవాల్సిన దుస్థితి తలెత్తింది. జగన్ ప్రభుత్వానికి అమరావతిపైనా, ఈ ప్రాంతంపైనా ఎంత కక్షంటే... కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ ప్రాజెక్టు రద్దు చేసింది. అనంతపురం-అమరావతి ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టుని తీసేసి కొడికొండ-మేదరమెట్ల ఎక్స్ప్రెస్వేని తెరపైకి తెచ్చింది. అమరావతి మీదుగా విజయవాడ- గుంటూరు రైల్వే ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్ల పక్కకు వెళ్లిపోయింది, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకి ఉరేసింది. రాజధానిలో కొంత డబ్బు వెచ్చిస్తే అందుబాటులోకి వచ్చే సీడ్ యాక్సెస్ రోడ్డుని పూర్తి చేయడం మానేసి, కరకట్ట రోడ్డుని విస్తరిస్తామని చెప్పింది. ఇప్పటికీ దానికి అతీగతీ లేదు.
రోజుకో కుట్ర..!
అమరావతి ఓ శ్మశానమని, ఎడారి అని, అక్కడి నేల భారీ నిర్మాణాలకే పనికిరాదని, అది మునిగిపోయే ప్రాంతమని... ఇలా వైకాపా నాయకులు అమరావతిని దెబ్బతీసేందుకు రోజుకో కుట్రను తెరపైకి తెచ్చారు. విపరీతంగా దుష్ప్రచారం చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులు దాదాపు నాలుగున్నరేళ్లుగా చేస్తున్న పోరాటం, వారి కన్నీళ్లు, బలిదానం పాలకుల పాషాణ హృదయాల్ని కదిలించలేకపోయాయి. అమరావతి మాస్టర్ప్లాన్ను విధ్వంసం చేసేందుకు.... ఆర్5 జోన్ పేరుతో ఇతర ప్రాంతాలకు చెందిన 50 వేల మందికిపైగా రాజధానిలో సెంటు పట్టాలు పంపిణీ చేశారు. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయడం, భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం వంటి అరాచకాలకు పాల్పడ్డారు. అమరావతి పరిరక్షణకు రాజధాని రైతులు, ప్రజలు చేస్తున్న పోరాటాన్ని అణచివేసేందుకు అన్ని రకాల కుట్రలూ పన్నారు. పోలీసుల్ని ప్రయోగించి దాష్టీకానికి పాల్పడ్డారు.
ఆ పేరే ఒక బ్రాండ్..!
అమరావతి నిర్మాణ దశలోనే ప్రపంచ దేశాలు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షించింది. సింగపూర్ ప్రభుత్వం చొరవ తీసుకుని అక్కడి ప్రఖ్యాత సంస్థలతో ప్రణాళికలు రూపొందించడం, ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా రైతులనూ రాజధాని నిర్మాణంలో భాగస్వాముల్ని చేస్తూ వారినుంచి సుమారు 34 వేల ఎకరాల భూమిని ‘ల్యాండ్ పూలింగ్’లో సమీకరించడం వంటి వినూత్న విధానాలతో అందరి దృష్టీ అమరావతిపై పడింది. స్వల్పకాలంలోనే అమరావతికి అంతర్జాతీయంగా ‘బ్రాండ్ ఇమేజ్’ ఏర్పడింది. ప్రజా రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోవడానికి ప్రపంచంలోని అనేక దేశాలు ఉత్సాహంగా ముందుకు వచ్చాయి. అన్ని అవసరాలకు పోను ప్రభుత్వం చేతిలో 8 వేల నుంచి 10 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్, తక్కువ వడ్డీకే దీర్ఘకాలిక రుణాలిచ్చేందుకు ప్రపంచబ్యాంకు, ఏఐఐబీ వంటి సంస్థల సంసిద్ధత, రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేటు సంస్థల ఆసక్తి, ప్రఖ్యాతి చెందిన విదేశీ సంస్థలతో ప్రణాళికలు, ఆకృతుల రూపకల్పన... ఇలా అమరావతి ఆరంభం నుంచే అనేక విశేషాల సమాహారంగా నిలిచింది. ప్రణాళికలు పూర్తయి, నిర్మాణాలు మొదలైన దశలోనే అమరావతి పరపతి ఎంతగా వ్యాపించిందంటే... బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో అమరావతి బాండ్లు రిలీజ్ చేస్తే గంట వ్యవధిలో రూ.2వేల కోట్లు సమకూరాయి. అమరావతికి నిధుల సమీకరణకు మసాలా బాండ్లు విడుదల చేసేందుకు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అంగీకరించింది.
మూడింటికే కట్టుబడి ఉన్నారట!
రాజధానిని అమరావతి నుంచి మార్చడానికి వీల్లేదని, నిర్దేశిత గడువులోగా రాజధాని నిర్మాణం పూర్తిచేయాలని సాక్షాత్తు హైకోర్టు విస్తృత ధర్మాసనం విస్పష్టంగా చెప్పినా... ముఖ్యమంత్రి ఆలోచనల్లో మార్పు రాలేదు. మూడు రాజధానులపై సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నప్పటికీ... జగన్ ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టోలో మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెప్పడం, కోర్టులు, న్యాయవ్యవస్థ అంటే ఆ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదనడానికి నిదర్శనాలు. అమరావతిపై జగన్ ప్రభుత్వం ఎంతగా కక్షగట్టిందంటే... గత ప్రభుత్వ హయాంలో అక్కడ ఏర్పాటైన ఎస్ఆర్ఎం, విట్, అమృత వంటి యూనివర్సిటీలకు వెళ్లే రోడ్లు కూడా వేయలేదు.
రోడ్లు తవ్వుకుపోతున్నా పట్టదు..!
ముందు నుంచీ అమరావతిపై జగన్ ప్రభుత్వం విషం చిమ్ముతూనే ఉంది. ఈ ఐదేళ్లలో అక్కడ తట్టెడు మట్టి వేయకపోగా, గత ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లను దుండగులు తవ్వేసి మట్టి, కంకర తరలించుకుపోతున్నా కనీసం రక్షణ కల్పించడంలేదు. భారీ ఇనుప పైపులను దుండగులు కోసేసి పట్టుకుపోతున్నారు. అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో రాజధాని నమూనాలతో ఏర్పాటు చేసిన గ్యాలరీని ఇటీవల దుండగులు విధ్వంసం చేశారు. అయినా ప్రభుత్వంలో కనీస స్పందన లేదు.
నిర్వీర్యం చేశారు...
రింగ్ రోడ్డు ఔట్...
రాజధాని చుట్టూ 189 కి.మీ.ల పొడవైన ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణాన్ని రూ.17,761 కోట్లతో ప్రతిపాదించారు. అది కార్యరూపం దాల్చితే ఓఆర్ఆర్ చుట్టూ భారీ పెట్టుబడులు వచ్చేవి.
రూ. 10 వేల కోట్లు వృథా
రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధికి, వివిధ భవనాల నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.10 వేల కోట్లకుపైగా వెచ్చించింది. ఆ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరైంది.
పెట్టుబడులు అన్నీ వెనక్కి..
అమరావతిలో ప్రాథమికంగా వస్తాయనుకున్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడుల విలువే సుమారు రూ.44,300 కోట్లు. అవన్నీ వైకాపా అధికారంలోకి వచ్చేనాటికే అమరావతిలో భూముల కేటాయింపు జరిగిన సంస్థలు చేసిన ప్రతిపాదనలే. అన్నీ పోయాయి.
ప్రఖ్యాత సంస్థలు మాయం
అమరావతిలో స్థలాల కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పోటీ పడ్డాయి. 24 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 208 ఎకరాలు, 18 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు 27 ఎకరాల్ని సీఆర్డీఏ కేటాయించింది. జగన్ ప్రభుత్వ వైఖరితో అవేమీ అక్కడ నిర్మాణాలు చేయలేదు.
విదేశాలు వద్దన్నాయి..
అమరావతిలో నిర్మాణాలు వేగంగా జరుగుతున్న సమయంలో ఎప్పుడు చూసినా రాత్రింబవళ్లు అన్న తేడా లేకుండా 20 వేల మంది కార్మికులు పనిచేసేవారు. దేశ, విదేశీ ప్రతినిధులతో అమరావతి, విజయవాడ ప్రాంతాలు సందడిగా ఉండేవి. అప్పట్లో విజయవాడ నుంచి సింగపూర్కి ప్రత్యేక విమాన సర్వీసు నడిచింది.
కంటి తుడుపు చర్యలు
గత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాల్లోనే ఇప్పటికీ సచివాలయం, శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. హైకోర్టూ అక్కడి నుంచే పనిచేస్తోంది. ఈ ఐదేళ్లలో హైకోర్టు దగ్గర ఒక అదనపు భవనం నిర్మించడం తప్ప జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఆ భవనం కూడా చోటు సరిపోవడంలేదని హైకోర్టు ఒత్తిడి పెట్టడంతో నిర్మించింది.
ప్రాజెక్టులు పరారు
అమరావతికి సమాంతరంగా కనకదుర్గ వారధి నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు జాతీయ రహదారికి అటూ ఇటూ కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన భారీ నివాస, వాణిజ్య ప్రాజెక్టులు అప్పట్లో మొదలయ్యాయి. వాటిలో కొన్ని పూర్తయ్యాయి. జగన్ ప్రభుత్వం అమరావతి నిర్మాణం నిలిపివేయడంతో వాటిలో భారీ ప్రాజెక్టులు కొన్ని దివాలా తీశాయి. పెట్టుబడిదారులంతా మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోయారు.
2.5 లక్షల మందికి ఉపాధి గల్లంతు
అమరావతిలో 1961 ఎకరాల్లో సార్టప్ ఏరియా ప్రాజెక్టు చేపట్టేందుకు సింగపూర్కి చెందిన అసెండాస్-సింగ్బ్రిడ్జి, సుర్బానా సంస్థల కన్సార్షియం ముందుకు వచ్చింది. ప్రాజెక్టు కొనసాగి ఉంటే ఇప్పటికే అమరావతి అనేక ఐటీ, ఆర్థిక సేవా సంస్థలకు కేంద్రంగా మారేది. ఈ ప్రాజెక్టు తొలి దశలోనే రూ.50వేల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చేవని అంచనా. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
-
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి