Goa: పర్యాటకుల్ని ఇబ్బంది పెడితే ఊరుకోం.. సీఎం సావంత్ గట్టి వార్నింగ్
ఇటీవల అమెరికా నుంచి వచ్చిన టూరిస్టుల పట్ల ట్యాక్సీ డ్రైవర్లు వ్యవహరించిన తీరుపై గోవా సీఎం ప్రమోద్ సావంత్(Pramod sawant) ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల్ని(Tourists) వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పనాజీ: ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతున్న గోవా(Goa)కు వచ్చే టూరిస్టుల్ని వేధింపులకు గురిచేసేవారికి సీఎం ప్రమోద్ సావంత్(Pramod sawant) గట్టి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకుల్ని ఇబ్బందులు పెట్టేవారిని వదిలిపెట్టబోమని.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి కల్పించేందుకు భారత సాయుధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ విజయ్’కు గుర్తుగా ఏటా డిసెంబర్ 19న జరుపుకొనే గోవా లిబరేషన్ డే వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మాట్లాడారు. తమ రాష్ట్రంలోని పర్యాటక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ఆ రంగం అభివృద్ధికి ట్యాక్సీ, టూర్ ఆపరేటర్ల సహకారం ఎంతో అవసరమన్నారు. అలాగే, అంతర్జాతీయంగా పర్యాటక రంగానికి సంబంధించి గోవాకు ఓ పాజిటివ్ ఇమేజ్ని సృష్టించేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బీచ్, ఎకో టూరిజం, వెల్నెస్, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి రంగాలను విభిన్న కోణాల్లో అన్వేషిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇటీవల గోవా అందాలను వీక్షించేందుకు మోర్ముగావ్ ఓడరేవుకు క్రూజ్ నౌకలో చేరుకున్న అమెరికా పర్యాటకుల బృందం పట్ల అక్కడి ట్యాక్సీ డ్రైవర్లు వ్యవహరించిన తీరు పట్ల సీఎం సావంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. క్రూజ్ నౌకలో గోవాకు చేరుకున్న 100 మంది అమెరికా టూరిస్టుల కోసం క్రూజ్ సిబ్బంది ఏర్పాటు చేసిన బస్సుల్ని ట్యాక్సీ డ్రైవర్లు అడ్డుకున్నారు. బస్సు డ్రైవర్తో గొడవకు దిగారు. తమను బస్సుల్లో ఎక్కనీయకుండా అడ్డుకున్న ట్యాక్సీ డ్రైవర్ల ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తంచేసిన అమెరికా టూరిస్టులు అక్కడి నుంచి మళ్లీ క్రూజ్ నౌక ఎక్కి కేరళకు వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై క్రూజ్ ఆపరేటర్లు సీఎం సావంత్ను కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సీఎం ఈరోజు మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు తమ పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తాయన్నారు. అలాగే, మైనింగ్ అంశంపైనా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ బ్లాక్లను వేలం వేయగలిగిందని.. ఇది సమీప భవిష్యత్తులోనే రాష్ట్రంలో మైనింగ్ కార్యకలాపాలు తిరగి ప్రారంభించడంలో దోహదపడుతుందన్నారు. భూకబ్జాలకు పాల్పడే వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం