Fake News: నకిలీ వార్తల వ్యాప్తి.. 94 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం నిషేధం!
సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా నకిలీ వార్తలు వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లను కేంద్రం నిషేధించింది. తాజాగా మరికొన్ని సోషల్ మీడియా ఖాతాలు..........
రాజ్యసభలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడి
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా నకిలీ వార్తలు వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లను కేంద్రం నిషేధించింది. తాజాగా మరికొన్ని సోషల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. 2021-22 మధ్య కాలంలో అసత్య వార్తలు ప్రసారం చేస్తున్న 94 యూట్యూబ్ ఛానెళ్లు, 19 సోషల్ మీడియా ఖాతాలు, 747 URLలపై నిషేధం విధించినట్లు వెల్లడించింది. దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా అంతర్జాలం, సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన ప్రసారమాధ్యమాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు వైకాపా ఎంపీ అయోధ్య రామిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు.
డిజిటల్ మాధ్యమాల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తి కట్టడికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - 2020 కింద గతేడాది ఫిబ్రవరి 25 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021ను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. దాని ప్రకారం ఏదైనా యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా ఖాతా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, కోడ్లు ఉల్లంఘించినట్లు గుర్తించినట్లయితే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. అలానే నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్యర్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2009 నవంబర్లో నిజనిర్ధారణ విభాగాన్ని (Fact checking unit) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విభాగం ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయడంతోపాటు, స్వయంగా విచారణ జరిపిన అంశాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు చేరవేస్తుందన్నారు. వాటితోపాటు సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలకు సంబంధించి వ్యాప్తి చెందుతున్న వీడియోలు, ఇన్ఫోగ్రాఫిక్స్, పోల్స్ గుర్తించి వాటికి సంబంధించిన నిజమైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తుందని మంత్రి తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తల వ్యాప్తి కట్టడికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలు రూపొందించాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. దానితోపాటు సోషల్ మీడియాలో కంటెంట్ నియంత్రణ, వాటిపై వచ్చే అభ్యంతరాలను విచారించేందుకు ప్యానెల్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం