Modi-Biden: ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం: మోదీ
అమెరికాలోని వైట్హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ సంయుక్తంగా మాట్లాడారు.
వాషింగ్టన్: ప్రజా ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా భారత్, (India) అమెరికా (America) పని చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇరుదేశాల వ్యవస్థలు, సంస్థలు ప్రజాస్వామ్య పునాదులపై నిర్మించి ఉన్నాయని చెప్పారు. అమెరికాలో (USA) తనకు దక్కిన గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు, 4 మిలియన్ల భారతీయ అమెరికన్లకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి తిరిగి వైట్హౌస్కు (White House) చేరుకున్నారు. ఆయనకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Joe Biden) దంపతులు ఘనస్వాగతం పలికారు. ఆయనకు గౌరవ సూచకంగా సైనికులు 19 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 3 దశాబ్దాల క్రితం సామాన్యుడిగా అమెరికా పర్యటనకు వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు.
‘‘నాడు వైట్ హౌస్ను బయట నుంచి చూశాను. ప్రధాని అయ్యాక పలుమార్లు అమెరికా పర్యటనకు వచ్చాను. తాజాగా పెద్ద ఎత్తున జన నీరాజనాలతో తొలిసారి వైట్హౌస్ ద్వారాలు తెరచుకున్నాయి. అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నారు. భారతీయులు తమ నిబద్ధత, నైపుణ్యంతో దేశ గౌరవాన్ని పెంపొందించారు. కొవిడ్ విపత్తువేళ ప్రపంచం కొత్త రూపు సంతరించుకుంది. ఇరుదేశాల స్నేహం విశ్వ సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదం చేసింది. ప్రపంచ ఆహారం కోసం ఇరుదేశాలు కలిసి పని చేసేందుకు కంకణబద్ధులై ఉన్నాయి. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శనం’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
భారత్-అమెరికా మధ్య బంధం చాలా గొప్పది : బైడెన్
భారత్, అమెరికా మధ్య బంధం చాలా గొప్పదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ఇరుదేశాల మధ్య సారూప్య విలువలు ఉన్నట్లు చెప్పారు. ఇరుదేశాల ప్రజల మధ్య ప్రత్యేక బంధం ఏర్పడిందన్నారు. రెండు గొప్ప దేశాలు, రెండు గొప్ప శక్తులు, ఇద్దరు గొప్ప స్నేహితులు 21వ శతాబ్ద గమనాన్ని నిర్వచించగలరని ఈ సందర్భంగా బైడెన్ వ్యాఖ్యానించారు. విశ్వాసమే మా ఇద్దరి మధ్య సంబంధాన్ని మరింత దృఢంగా తయారు చేసిందన్నారు. ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా భారత్-అమెరికా కలిసి పని చేయడం చాలా అవసరమని బైడెన్ అన్నారు. పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులను పరిష్కరించడం, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత తదితర అంశాల్లో ఇరుదేశాలు కలిసి పని చేస్తున్నాయని గుర్తు చేశారు.
అమెరికన్ల జీవితాల్లో ఇండో అమెరికన్లు భాగస్వామ్యమైనట్లు స్పష్టంగా కనిపిస్తోందని బైడెన్ తెలిపారు. వారు ఇరు దేశాలకు వారధి లాంటివారని అన్నారు. వైట్హౌస్లోనూ, కాంగ్రెస్లోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోందన్న ఆయన.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అందుకు చక్కని ఉదాహరణ అని చెప్పారు. సాంకేతిక రంగంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో సామాజికంగా, ఆర్థికంగా తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్ను నిర్ణయిస్తాయని బైడెన్ తెలిపారు. ప్రజాస్వామ్య దేశాలుగా ఆర్థిక భాగస్వాములు ఆకర్షించే అవకాశం ఇరు దేశాలకూ ఉందని ఆయన అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
Swati Maliwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?