India Corona : 19 వేలు దాటిన క్రియాశీల కేసులు..

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు 3వేలకుపైగానే

Published : 01 May 2022 10:27 IST

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు 3వేలకుపైగానే నమోదవుతున్నాయి. అయితే..అంతకుముందు రోజుతో పోల్చితే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతూ 19 వేలకు చేరుకున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

> గడిచిన 24 గంటల్లో  4,71,087 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 3,324 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు ఈ సంఖ్య 3,688గా ఉంది.

> గడిచిన 24 గంటల్లో కరోనాతో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఇందులో 36 మరణాలు కేరళ నుంచే నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 5,23,843కు చేరింది.

తాజాగా 2,876 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.25 కోట్లు దాటింది. ఆ రేటు 98.74%గా కొనసాగుతోంది.

> ఇక గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా నమోదవుతుండటంతో  క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 19,092 యాక్టివ్‌ కేసులు(0.04%) ఉన్నాయి.

> దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 25,95,267 మంది టీకాలు తీసుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 189.17 కోట్లు దాటింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని