India Corona : 90 వేలు దాటిన క్రియాశీల కేసులు..

దేశంలో కరోనా వ్యాప్త కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో 15 వేలకుపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Updated : 25 Jun 2022 10:37 IST

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో 15 వేలకుపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే అంతకుముందు రోజు 17 వేలకుపైగా కేసులు నమోదు కాగా.. తాజాగా 16 వేల దిగువకు అవి చేరాయి. అయితే వీటిలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచే సగానికిపైగా కేసులు ఉంటున్నాయి. ఇక క్రియాశీల కేసులు భారీగా పెరుగుతూ 90 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

నిన్న నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య : 3,63,103
 కొత్తగా నమోదైన కేసులు : 15,940 (మహారాష్ట్రలో 4205, కేరళలో 3,981 కేసులు)
 రోజువారీ పాజిటివిటీ రేటు : 4.39%
 నిన్న చోటుచేసుకున్న మరణాలు : 20 ( మొత్తం మరణాలు 5,24,974)
 రికవరీలు : 12,425(మొత్తం రికవరీలు 4.27 కోట్లు(98.58%)
 ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య : 91,779  (0.21%)
 వ్యాక్సినేషన్‌ : 15,73,341 ( మొత్తం పంపిణీ చేసిన టీకాలు : 196.94 కోట్లు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని