PM Modi: ప్రపంచ ఆర్థికాభివృద్ధి కేంద్రంగా భారత్.. అదే మా లక్ష్యం: ప్రధాని మోదీ
కొన్నేళ్లలో ప్రపంచంలోనే అతి పెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రంలోని గత ప్రభుత్వాలు పారిశ్రామికాభివృద్ధి పట్ల ఉదాసీనంగా వ్యవహరించాయని విమర్శించారు.
అహ్మదాబాద్: భారత దేశం త్వరలోనే ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా అవతరిస్తుందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్లో పాల్గొన్న ప్రధాని.. భారత్ను ప్రపంచ అభివృద్ధికి చోదకశక్తిగా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు. 20 ఏళ్ల క్రితం వైబ్రెంట్ గుజరాత్ పేరుతో నాటిన విత్తనం నేడు దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శిగా మారి, పెద్ద వృక్షంగా అవతరించిదన్నారు. కొన్నేళ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ప్రధాని పేర్కొన్నారు.
‘‘గుజరాత్ను దేశానికి అభివృద్ధి కేంద్రంగా మార్చాలని వైబ్రెంట్ గుజరాత్ను నిర్వహించాం. 2014 తర్వాత ప్రంపచాభివృద్ధికి భారత్ను చోదకశక్తిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం భారత్ ఆ దశలోనే ఉంది. త్వరలోనే ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా భారత్ అవతరిస్తుంది. ఇందుకు నాది గ్యారంటీ. ఇప్పటి నుంచి రాబోయే కొన్నేళ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది’’ అని ప్రధాని తెలిపారు.
ఖలిస్థానీ గ్యాంగ్స్టర్లపై విరుచుకుపడ్డ ఎన్ఐఏ.. ఆరు రాష్ట్రాల్లో తనిఖీలు..!
కేంద్రంలోని గత ప్రభుత్వాలు పరిశ్రమల ఏర్పాటు పట్ల ఉదాసీనంగా వ్యవహరించాయని ప్రధాని విమర్శించారు. కానీ, వైబ్రెంట్ గుజరాత్ ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి సాధించామని తెలిపారు. మొదట ఏ పని అయినా తిరస్కరణకు గురవుతుందని, పట్టుదలతో కృషి చేస్తే విజయం సాధించవచ్చని స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. వైబ్రెంట్ గుజరాత్ విజయానికి ఇదే కారణమని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!