Bharat Jodo Yatra: కలిసి నడిచిన రాహుల్, కమల్‌ హాసన్‌

భారత్‌ జోడో యాత్రలో ప్రముఖ నటుడు కమల్‌ హాసన్ సందడి చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ వెంట నడిచి మద్దతు పలికారు. 

Published : 24 Dec 2022 18:22 IST

దిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతోన్న భారత్‌ జోడో యాత్రలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు. పలువురు నటీమణులు, రాజకీయ ప్రముఖులు ఆయన వెంట నడుస్తున్నారు. తాజాగా దిల్లీలో జరుగుతోన్న యాత్రలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం(MNM) అధినేత కమల్ హాసన్ పాల్గొన్నారు. రాహుల్ ఆహ్వానం మేరకు ఆయన పాల్గొంటారని ఇదివరకు ఎంఎన్‌ఎం పార్టీ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. 

శనివారం హరియాణా నుంచి జోడో యాత్ర దిల్లీకి చేరుకుంది. ఈ క్రమంలో రాహుల్‌తో కలిసి ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు.  యాత్రలో పాల్గొన్న కమల్‌,  రాహుల్‌తో కలిసి నడిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 7న కన్యాకుమారిలో ఈ భారత్‌ జోడో యాత్ర ప్రారంభమైంది. డిసెంబర్ 16తో వందరోజులు పూర్తి చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని