ఉచిత టీకా పంపిణీకి మహారాష్ట్ర నిర్ణయం!
కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా అందించేందుకు ఆయా రాష్ట్రాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం తమ ప్రజలకు ఉచితంగానే పంపిణీ చేస్తామని మంత్రి నవాబ్ మాలిక్ వెల్లడించారు.
ముంబయి: కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా అందించేందుకు ఆయా రాష్ట్రాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలకు ఉచితంగానే పంపిణీ చేస్తామని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ వెల్లడించారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ చర్చించిందని.. త్వరలోనే వీటికి అవసరమైన టెండర్లను పిలుస్తామని తెలిపారు. తమ రాష్ట్ర ప్రజలకు ఉచితంగానే టీకా పంపిణీ చేస్తామని ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మరో 10రాష్ట్రాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
ముంబయిలో మొబైల్ వ్యాన్ల ద్వారా..
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన కేంద్రాల్లో టీకా పంపిణీ కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో టీకా పంపిణీ కేంద్రాల వద్ద రద్దీ పెరుగుతోంది. దీంతో డోర్-టూ-డోర్ వ్యాక్సినేషన్ నిర్వహించాలనే డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో అలాంటి ప్రణాళిక లేదని ముంబయి మునిసిపల్ అధికారులు స్పష్టం చేశారు. మూడోదశ టీకా పంపిణీ(మే 1)లో ముంబయిలో మొబైల్ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని నగర మేయర్ కిశోరీ పెడ్నేకర్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆయా రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా మే 1 తేదీ నుంచి మూడో విడతలో భాగంగా 18ఏళ్ల వయసుపైబడిన వారందరికీ టీకా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటివరకు 45ఏళ్ల వయసుపైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగానే అందజేస్తుంది. టీకా పంపిణీపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని వెల్లడించింది. తయారీ సంస్థలనుంచి 50శాతం డోసులు కేంద్రానికి, మరో 50శాతం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు నేరుగా తయారీ సంస్థలనుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉచింతగా టీకా అందిస్తామని ప్రకటిస్తున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించే టీకాలను మాత్రం ఉచితంగా అందజేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం