Anil Firojiya: 32 కేజీలు తగ్గాను..! మంత్రి రూ.2,300 కోట్లు ఇచ్చారు..!!
ఉజ్జయినిలోని మాల్వాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్ గడ్కరీ ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో అధిక బరువుతో ఉన్న ఎంపీ అనిల్ ఫిరోజియాను చూసి గడ్కరీ ఆశ్చర్యపోయారట.
(పాత చిత్రం)
ఉజ్జయిని: తన నియోజకవర్గ అభివృద్ధి కోసం కొన్ని నెలల వ్యవధిలో ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా 32 కేజీలు తగ్గారు. అందుకు తగ్గట్టే రెండువేల కోట్లు రూపాయాలకు పైగా నిధులు దక్కించుకున్నారు. ఇక్కడ అభివృద్ధికి, బరువుకు సంబంధం ఏంటనిపిస్తోంది కదా..! ఇంతకీ ఏం జరిగిందంటే..?
ఉజ్జయినిలోని మాల్వాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్ గడ్కరీ ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో అధిక బరువుతో ఉన్న ఎంపీ అనిల్ ఫిరోజియాను చూసి గడ్కరీ ఆశ్చర్యపోయారట. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బరువు తగ్గాలని సూచించిన గడ్కరీ.. ఇందుకోసం ఎంపీకి ఓ సవాల్ కూడా విసిరారు. ‘‘తన నియోజకవర్గానికి నిధులు కేటాయించాలంటూ అనిల్ తరచూ నన్ను డిమాండ్ చేస్తుంటారు. అయితే, అందుకు ఆయనకు నేనే షరతు పెట్టాను. నేను కూడా గతంలో 135 కేజీలు ఉండేవాడిని. ఇప్పుడు 93 కేజీలకు తగ్గాను. నా పాత ఫొటో కూడా చూపించాను. నా కండిషన్ ఏంటంటే.. ఉజ్జయిని అభివృద్ధికి నిధులు కావాలంటే బరువు తగ్గాలని చెప్పాను. ఎన్ని కేజీలు తగ్గితే.. కేజీకి రూ.1000కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తాను’’ అని గడ్కరీ స్టేజీ మీదే చెప్పారు.
అప్పటి నుంచి అనిల్ తన ఫిట్నెస్పైనే దృష్టిపెట్టారు. యోగా, ఫిజికల్ వర్కౌట్లు, స్విమ్మింగ్ వంటివి చేస్తున్నారు. ‘నేను మంత్రి సవాలును స్వీకరించాను. ఇప్పటివరకూ 32 కేజీల బరువు తగ్గాను. తాజాగా నేను నితిన్ గడ్కరీని కలిశారు. నన్ను చూసి ఆయన చాలా సంతోషించారు. తన వాగ్దానంలో భాగంగా రూ.2,300 కోట్ల విలువైన అభివృద్ధి ప్రణాళికలకు ఆమోదం తెలిపారు’ అని అనిల్ మీడియాకు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం