Jammu Kashmir జమ్మూకశ్మీర్‌ను జల్లెడపడుతున్న ఎన్‌ఐఏ.. 45 ప్రాంతాల్లో సోదాలు!

జమ్మూకశ్మీర్‌వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం 14 జిల్లాల్లోని 45 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఉగ్రవాదులకు నిధుల చేరవేతకు...

Updated : 08 Aug 2021 10:08 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం 14 జిల్లాల్లోని 45 ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టింది. ఉగ్రవాదులకు నిధుల చేరవేతకు సంబంధించిన ఓ కేసు నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. నిషేధిత జమాతే ఇస్లామీ సభ్యుల నివాసాలే లక్ష్యంగా ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

దిల్లీ నుంచి బయలుదేరిన ప్రత్యేక ఎన్‌ఐఏ బృందం ఈ సోదాలు నిర్వహిస్తోంది. వీరికి జమ్మూకశ్మీర్‌ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బృందాలు సహకరిస్తున్నాయి. దోడా, కిష్టావర్‌, రంబన్‌, అనంత్‌నాగ్‌, బద్గాం, రజౌరీ, షోపియాన్‌ సహా మరికొన్ని జిల్లాల్లోని అనుమానితుల నివాసాల్లో దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే పలు కీలక పత్రాలతో పాటు, డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పాకిస్థాన్‌ అనుకూల కార్యక్రమాలు చేపడుతూ దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్న జమాతే.. పలు ఉగ్రవాద కార్యక్రలాపాలకు నిధులు సమకూర్చుతున్నట్లు ఇటీవల నమోదైన ఓ కేసులో బహిర్గతమైంది. గతవారం కూడా ఎన్‌ఐఏ పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని