కొవిడ్ రూల్స్ అతిక్రమణ: ప్రధానికే భారీ జరిమానా!
దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రకటించిన నార్వే ప్రధాన మంత్రి.. చివరకు ఆమె కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించింది. దీంతో నార్వే ప్రధాన మంత్రికి అక్కడి పోలీసులు భారీ జరిమానా విధించారు.
ఓస్లో: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ.. కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయా ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయితే దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రకటించిన నార్వే ప్రధాన మంత్రే, వాటిని ఉల్లంఘించింది. దీంతో ఆమెకు అక్కడి పోలీసులు భారీ జరిమానా విధించారు.
కరోనా వైరస్ విజృంభణ దృష్ట్యా నార్వేలో కొవిడ్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా 10 మందికి పైగా హాజరయ్యే కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతోంది. కానీ నార్వే ప్రధాని ఎర్నా సోల్బెర్గ్ ఈ మార్చిలో 60వ పుట్టినరోజు వేడుకను సన్నిహితుల సమక్షంలో జరుపుకున్నారు. ఆ కార్యక్రమంలో 13 మంది పాల్గొన్నారు. ఇది బయటకు పొక్కడంతో ఆవిడ క్షమాపణ కోరారు. కానీ భౌతిక దూరం ఆంక్షలకు విరుద్ధంగా ప్రధానమంత్రి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు దాదాపు రూ.1.75 లక్షల జరిమానా (20వేల నార్వేజియన్ క్రోన్) విధించినట్లు నార్వే పోలీస్ చీఫ్ ఓలేసావెయరడ్ వెల్లడించారు. నిబంధనలు పాటించని చాలా కేసుల్లో జరిమానా వేయలేదు. కానీ అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రధానమంత్రే రూల్స్ పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రధానమంత్రిని కూడా విడిచిపెట్టకపోవడం వల్ల కొవిడ్ నిబంధనలు, ఆంక్షల అమలుపై సామాన్య ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని నార్వే పోలీసులు అభిప్రాయపడ్డారు.
కరోనా వైరస్ విజృంభణతో యూరప్ వణుకుతోంది. అయితే ప్రధానమంత్రి ఎర్నా నేతృత్వంలో కరోనా కట్టడికి నార్వేలో ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. దీంతో మిగతా దేశాలతో పోలిస్తే అక్కడ కరోనా వ్యాప్తి కాస్త అదుపులోనే ఉంది. ఇప్పటి వరకు అక్కడ లక్షా రెండు వేల పాజిటివ్ కేసులు, 684 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra: సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ తన అభిప్రాయాలను పంచుకొనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఆమె తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చాడు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర