అవయవ మార్పిడి: వ్యాక్సిన్ తీసుకున్నా మరింత జాగ్రత్త!
అవయవ మార్పిడి జరిగిన వ్యక్తులు రెండు డోసులతో రక్షణ కల్పిస్తున్నప్పటికీ మాస్కులు, భౌతిక దూరం వంటి చర్యలు మరింత అవసరమని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఇప్పటికే అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, అవయవ మార్పిడి జరిగిన వ్యక్తులకు రెండు డోసులతో రక్షణ కల్పిస్తున్నప్పటికీ మాస్కులు, భౌతిక దూరం వంటి చర్యలు మరింత అవసరమని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. అవయవ మార్పిడి వారిలో వ్యాక్సిన్ పనితీరుపై జరిగిన తాజా అధ్యయనం జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA)లో ప్రచురితమైంది.
వివిధ ఆరోగ్య సమస్యలున్న వ్యక్తులపై కొవిడ్ వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అవయవ మార్పిడి జరిగిన వ్యక్తుల్లో వ్యాక్సిన్ పనితీరుపై జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. అమెరికాలో జరిగిన ఈ అధ్యయనంలో మోడెర్నా, ఫైజర్ టీకా తీసుకున్న 658 మంది అవయవ మార్పిడి జరిగిన వ్యక్తులపై అధ్యయనం చేపట్టారు. వీరిలో తొలిడోసు తీసుకున్న తర్వాత కేవలం 98 మందిలో(15శాతం), రెండో డోసులు తీసుకున్న అనంతరం 357 మందిలో సార్స్-కోవ్-2 ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండు డోసులు తీసుకున్నప్పటికీ 259 మందిలో ఎలాంటి యాంటీబాడీలు ఉత్పత్తి కాలేదని పరిశోధకులు కనుగొన్నారు. కేవలం యువకుల్లోనే ఈ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఇవి చాలా స్వల్పంగా ఉన్నాయని తెలిపారు.
అవయవ మార్పిడి జరిగిన వారిలో రెండు డోసులు తీసుకున్నప్పటికీ పూర్తి రక్షణ కల్పిస్తాయని చెప్పలేమనే విషయం తాజా అధ్యయనం ద్వారా స్పష్టమవుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డోరీ సెగెవ్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినప్పటికీ ఆరోగ్యవంతులైన వారితో పోలిస్తే అవి తక్కువగానే ఉంటున్నాయని గుర్తించామన్నారు. అందుచేత అవయవ మార్పిడి జరిగిన వారితోపాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.