PM Modi: తీగల వంతెన కూలిన ఘటనపై ప్రధాని మోదీ భావోద్వేగం.. వీడియో
గుజరాత్లోని మోర్బీ(Morbi tragedy)లో నిన్న సాయంత్రం తీగల వంతెన(Cable Bridge) కూలి 130మందికి పైగా మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) భావోద్వేగానికి గురయ్యారు.
బనస్కాంత: గుజరాత్లోని మోర్బీ(Morbi tragedy)లో నిన్న సాయంత్రం తీగల వంతెన(Cable Bridge) కూలి 130మందికి పైగా మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) భావోద్వేగానికి గురయ్యారు. గుజరాత్లోని బనస్కాంతలో పర్యటిస్తున్న సందర్భంగా థారాడ్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. మోర్బీలో జరిగిన విషాదం భయంకరమైనది.. అత్యంత బాధాకరమైనదని చెమర్చిన కళ్లతో అన్నారు. అయితే, ఈ దుర్ఘటన నేపథ్యంలో బనస్కాంతలో ఈరోజు ఈ సభలో పాల్గొనాలా? వద్దా.. అని తనలో తాను ఆలోచించాననీ.. ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు, ఇక్కడి సంస్కృతే తన ధైర్యాన్ని కూడగట్టి ఇక్కడికి వచ్చేందుకు సహకరించిందని పేర్కొన్నారు. నీటి సరఫరాకు సంబంధించి రూ.8వేల కోట్ల విలువ చేసే పలు ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవం చేసినట్టు అధికారులు తెలిపారు. వీటిలో నీటి సరఫరా పైపులైన్లు, కాల్వల నిర్మాణాలు, 56 చెక్డ్యామ్లు కూడా ఉన్నట్టు తెలిపారు. త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆ ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేసేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి విచ్చేసిన ప్రధాని మోదీ మంగళవారం మోర్బీకి వెళ్లనున్నట్టు గుజరాత్ సీఎం కార్యాలయం ట్విటర్లో వెల్లడించింది.
ఈ ఉదయం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ కేవడియాలోని ఐక్యతా విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించిన విషయం తెలిసిందే. ఇక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయగా.. మోర్బీ ప్రమాదం నేపథ్యంలో వాటిని రద్దు చేశారు. అక్కడ మోదీ మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడ ఉన్నా.. నా మనసంతా మోర్బీ బాధితుల గురించే ఆలోచిస్తోంది. ఇంతటి బాధను అనుభవించిన సందర్భాలు చాలా తక్కువ. ఓ వైపు గుండెల నిండా భరించలేని ఆవేదన ఉన్నా.. తప్పక విధులు నిర్వహించాల్సి వస్తోంది’’ అని ఉద్వేగానికి గురయ్యారు. మోర్బీలో ఆదివారం సాయంత్రం మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి తీగల వంతెన కుప్పకూలి పెను ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 134 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది గల్లంతయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం