Bhagwant Mann: గుజరాత్లో పంజాబ్ సీఎం గర్బా స్టెప్పులు!
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గర్బా నృత్యం చేసి అలరించారు. గుజరాత్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన స్టేజిపైనే స్టెప్పులేశారు.
రాజ్కోట్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గర్బా స్టెప్పులు వేసి అలరించారు. ఆయన డ్యాన్స్కు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. గుజరాత్లోని రాజ్కోట్లో నిర్వహించిన శరన్నవరాత్రి ఉత్సవాలకు పంజాబ్ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే, కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన అభిమానులు, భక్తులు గర్బా వేయాలంటూ మాన్ను కోరారు. వారి అభ్యర్థనను మన్నించిన సీఎం.. వేదికపైనే గర్బా నృత్యం చేసి అలరించారు. ఆపై పంజాబీ నృత్యమైన బాంగ్రా స్టెప్పులు కూడా వేశారు.
దుర్గా మాతను భక్తితో కొలిచే గుజరాతీలు శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యమైన గర్బా చేస్తారు. ఇదిలా ఉంటే.. ఆమ్ ఆద్మీ పార్టీకే చెందిన ఎంపీ రాఘవ్ చద్దా సైతం గర్బా డాన్స్ చేస్తున్న వీడియోలు వైరలయ్యాయి. వడోదరాలో జరిగిన ఓ బహిరంగ సభలో ఇతరులతో కలిసి గర్బా స్టెప్పులు వేసి ఆయన ఆకట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.