PM Modi: ఉచిత హామీలు దేశాభివృద్ధికి ప్రమాదకరం: ప్రధాని మోదీ

ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు........

Published : 17 Jul 2022 01:39 IST

లఖ్‌నవూ: ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) వ్యాఖ్యానించారు. ఈ ఉచితాల పట్ల ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడమే కాకుండా దేశ భవిష్యత్‌నూ నిర్మిస్తోందని ఉద్ఘాటించారు. ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లో నిర్మించిన 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌ రహదారిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌(Yogi Adityanath)తో కలిసి మోదీ ప్రారంభించారు.

296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారిని రూ.14,850 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ రహదారి ఉత్తర్‌ప్రదేశ్‌లోని 7 జిల్లాలను కలుపుతుంది. గతంలో నాలుగు లైన్లు ఉండగా ప్రస్తుతం ఆరు లైన్లకు విస్తరించారు. ఈ రహదారి ద్వారా చిత్రకూట్ నుంచి దేశ రాజధాని దిల్లీకి ఆరు గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో జలౌన్ జిల్లా ఒరాయ్‌ మండలం కైతేరీ గ్రామంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ.. ఈ ఎక్స్‌ప్రెస్‌ వేతో చిత్రకూట్‌ నుంచి దిల్లీకి ప్రయాణం 3, 4 గంటలు తగ్గడమే కాకుండా పారిశ్రామికంగా బుందేల్‌ఖండ్‌ పరుగులు పెడుతుందన్నారు.సీఎం యోగి ఆదిత్యనాథ్ ​నేతృత్వంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతలు మెరుగపడటమే కాకుండా, రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని మోదీ అన్నారు. ఇదంతా డబుల్‌ ఇంజిన్ సర్కారుతోనే సాధ్యమవుతోందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని