Gujarat Rains: గుజరాత్లో వడగండ్ల వాన.. పిడుగుపాటుకు 20 మంది మృతి
Gujarat Rains: గుజరాత్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల పిడుగులు పడి 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
అహ్మదాబాద్: అకాల వర్షాల (Unseasonal Rains)తో గుజరాత్ (Gujarat) రాష్ట్రం అతలాకుతలమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఆదివారం భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగండ్లు పడ్డాయి. ఇక పలు ప్రాంతాల్లో పిడుగులు పడి 20 మంది మృతిచెందినట్లు రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారులు సోమవారం వెల్లడించారు.
గుజరాత్లోని మొత్తం 252 తాలూకాల్లో 234 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. సూరత్, సురేంద్రనగర్, ఖేడా, తాపి, భరూచ్లో 16 గంటల్లో రికార్డు స్థాయిలో 50-117 మి.మీ వర్ష పాతం నమోదైంది. రాజ్కోట్, మోర్బీ జిల్లాల్లో కొన్ని చోట్ల వడగండ్లు కురిశాయి. దీంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో ఫ్యాక్టరీలు మూతబడ్డాయి.
అప్రమత్తంగా ఉండాలి.. చైనాలో శ్వాసకోశ సమస్యపై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
దాహోద్ జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు, భరూచ్లో ముగ్గురు, తాపిలో ఇద్దరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్, అమ్రేలీ, సూరత్, సురేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో పిడుగులు పడి మరో 11 మంది మరణించినట్లు పేర్కొన్నారు. అకాల వర్షాలతో పలువురు మృతిచెందడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
అటు రాజస్థాన్ (Rajasthan), మహారాష్ట్ర (Maharashtra)లోనూ నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య అరేబియా సముద్రంలో తుపాను (Cyclone) ఏర్పడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీంతో గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం కూడా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!