కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడి మృతి

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి పుత్రవియోగం జరిగింది. ఆయన పెద్దకుమారుడు ఆశిష్‌ ఏచూరి కరోనాతో మృతిచెందారు.

Updated : 22 Apr 2021 10:42 IST

దిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన పెద్ద కుమారుడు ఆశిష్‌ ఏచూరి (34) కరోనా వైరస్‌ బారిన పడి గురువారం మృతి చెందారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి స్వయంగా ట్విటర్‌ వేదికగా ధ్రువీకరించారు.

‘ఈ విషయం తెలియజేయడానికి ఎంతో బాధగా ఉంది. కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడి నా పెద్ద కొడుకు ఆశిష్‌ ఈ ఉదయం మృతి చెందారు. మా కుమారుడిని బతికించేందుకు శ్రమించి చికిత్స అందించిన వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్‌ కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బందికి, ఈ ఆపత్కాలంలో మాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని ఏచూరి ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రధాని మోదీ సంతాపం

ఆశిష్‌ ఏచూరి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఈ బాధాకర సమయంలో ఏచూరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు.  సీపీఎం పొలిట్‌బ్యూరోతో పాటు కేరళ సీఎం పినరయి విజయన్‌, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని