SKM: దేశవ్యాప్తంగా ‘రాజ్భవన్ మార్చ్’లకు రైతు సంఘాల పిలుపు
దిల్లీ సరిహద్దుల్లో తాము చేపట్టిన చారిత్రక పోరాటానికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 26న దేశ వ్యాప్తంగా ‘రాజ్భవన్ మార్చ్’లకు రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గతంలో ఏడాదికి పైగా ఉద్యమించిన రైతు సంఘాల నేతలు తాజాగా మరో పిలుపు ఇచ్చారు. దిల్లీ సరిహద్దుల్లో తాము చేపట్టిన చారిత్రక పోరాటానికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 26న దేశ వ్యాప్తంగా ‘రాజ్భవన్ మార్చ్’లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పలు రైతు సంఘాలతో ఏర్పాటైన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఓ ప్రకటన విడుదల చేసింది. మంగళవారం ఎస్కేఎం సమన్వయ కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీలు వర్చువల్గా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే, రాజ్భవన్ మార్చ్, గవర్నర్లకు సమర్పించే వినతిపత్రాలకు తుదిరూపు ఇచ్చేందుకు మరోసారి నవంబర్ 14న దిల్లీలో సమావేశం కానున్నట్టు ఎస్కేఎం నేతలు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ వర్చువల్ భేటీలో ఎస్కేఎం నేతలు హన్నన్ మొల్లా, దర్శన్పాల్, యుధ్వీర్ సింగ్, మేధా పాట్కర్, రాజారాం సింగ్, అతుల్ కుమార్ అంజన్, సత్యవాన్, అశోక్ ధల్వాలే, అవిక్ సాహా, సుఖ్దేవ్ సింగ్, రామిందర్ సింగ్, వికాస్ శిశిర్, డా.సునీలం తదితరులు పాల్గొన్నారు.
తమ పోరాటానికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్భవన్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించినట్టు ఎస్కేఎం నేతలు తెలిపారు. ‘రాజ్భవన్ మార్చ్’ కోసం పలు రాష్ట్రాల్లో సన్నాహాలు జరుగుతున్నాయని.. సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే, అటవీ సంరక్షణ చట్టం నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మార్పుల్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. అలాగే, తమ హక్కుల కోసం పోరాడుతున్న గిరిజన సంఘాలకు నవంబర్ 15న (దివంగత బిర్సా ముండా జయంతి రోజు) సంఘీభావం ప్రకటించాలని నిర్ణయించారు. సాగు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ 2020 నవంబర్లో వేలాది మంది రైతులు (ముఖ్యంగా పంజాబ్, హరియాణా నుంచి) దిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి తీవ్ర నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గతేడాది నవంబర్లో మోదీ సర్కార్ ఈ సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ ఉద్యమం సందర్భంగా రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని, ఆందోళనల్లో చనిపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలంటూ రైతులు మాత్రం తమ ఉద్యమాన్ని కొనసాగించారు. దీంతో 2021 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను అంగీకరించడంతో ఏడాదికి పైగా కొనసాగించిన తమ ఉద్యమాన్ని విరమిస్తున్నట్టు ఎస్కేఎం నేతలు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం