Bengal Politics: యథావిధిగానే భవానీపూర్ ఉపఎన్నిక..!
పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికను ఈ దశలో వాయిదా వేయలేమని కలకత్తా హైకోర్టు పేర్కొంది.
ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమన్న కలకత్తా హైకోర్టు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికను ఈ దశలో వాయిదా/ రద్దు చేయలేమని కలకత్తా హైకోర్టు పేర్కొంది. ఎన్నికల సంఘం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఉప ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే, భవానీపూర్కు ఉపఎన్నిక నిర్వహించడం అత్యవసరమని పేర్కొంటూ పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి లేఖ రాయడాన్ని కలకత్తా హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆ లేఖను వ్యతిరేకిస్తూ.. భవానీపూర్ ఎన్నిక వాయిదా వేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం.. ఈ దశలో ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.
పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి సెప్టెంబర్ 30న పోలింగ్ జరుగనుంది. అయితే, అంతకుముందు ‘రాజ్యాంగపరమైన అత్యవసరాన్ని’ పరిగణనలోకి తీసుకొని భవానీపూర్లో ఉపఎన్నిక నిర్వహించాలని పశ్చిమబెంగాల్ ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అక్కడ ఉపఎన్నిక నిర్వహిస్తామంటూ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన సయాన్ బెనర్జీ అనే వ్యక్తి.. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ కలకత్తా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ కేసు విచారణను చేపట్టిన కలకత్తా హైకోర్టు.. ఈ విషయంలో పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీ తీరును తీవ్రంగా పరిగణించింది. ఎవరో ఒక వ్యక్తి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఆయన (చీఫ్ సెక్రటరీ) పనిచేయకూడదు. ఎవరు అధికారంలో ఉన్నా చట్టప్రకారం తన విధులను నిర్వర్తించాలని వ్యాఖ్యానించింది. మరోవైపు పిటిషనర్ కూడా రాజ్యాంగ అత్యవసరమనే పదాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేసినట్లు కోర్టు పేర్కొంది. అయినప్పటికీ ఎన్నికల సంఘం నిర్ణయం ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉండదని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా భవానీపూర్ ఉప ఎన్నిక నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోవడం సరైనది కాదని అభిప్రాయపడిన హైకోర్టు.. సెప్టెంబర్ 30న ఉపఎన్నిక యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేసింది. ఇదిలాఉంటే, ఇప్పటికే భవానీపూర్లో ఉప ఎన్నికకు ప్రచారం గడువు ముగియగా.. ఈ గురువారం పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 3న కౌంటింగ్ చేపట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం