Buddhadeb Bhattacharya: కోల్కతా వీధుల్లో.. మాజీ సీఎం మరదలు
పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, వామపక్ష సీనియర్ నేత బుద్దదేవ్ భట్టాచార్య మరదలు ఇరా బసు ప్రస్తుతం కోల్కతా వీధుల్లో దీన స్థితిలో జీవనం సాగిస్తున్నారు.
దీన స్థితిలో రిటైర్డ్ టీచర్
కోల్కతా: ఆమె ఓ మాజీ ముఖ్యమంత్రికి సమీప బంధువు. అంతకుమించి చేతిలో పీహెచ్డీ పట్టా.. ఉపాధ్యాయురాలిగా పనిచేసి పదవీవిరమణ.. స్థానిక భాషతో పాటు ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం.. ఇన్ని విశేషాలున్న ఓ మహిళ.. ప్రస్తుతం చెరిగిన జుట్టు, మాసిన దుస్తులతో ఓ ఫుట్పాత్పై నివసిస్తోంది. అంతేకాదు తోపుడు బండ్ల వారు అందించే ఆహారాన్ని తీసుకుంటూ జీవనం సాగించడం అందర్నీ కలచివేస్తోంది. ఆమె ఎవరో కాదు పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, వామపక్ష సీనియర్ నేత బుద్దదేవ్ భట్టాచార్య మరదలు ఇరా బసు.
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య భార్య మీరా సోదరి ఇరా బసు ప్రస్తుతం కోల్కతా వీధుల్లో దీన స్థితిలో ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పశ్చిమబెంగాల్లో నార్త్ 24 పరగణాల జిల్లాలోని ప్రియనాథ్ బాలికోన్నత పాఠశాలలో 1976 నుంచి ఆమె టీచర్గా సేవలందించారు. దాదాపు 34ఏళ్లపాటు అదే పాఠశాలలో పనిచేసిన ఇరా బసు.. 2009లో పదవీ విరమణ పొందారు. తర్వాత అప్పటివరకు నివాసమున్న చోటునుంచి ఇరా బసు మకాం మార్చారు. అప్పటినుంచి ఎవ్వరికీ కనిపించకుండా పోయిన ఇరా బసు.. గత కొంతకాలంగా డన్లాప్ జంక్షన్ వద్ద ఉంటున్నట్లు పూర్వ విద్యార్థులు గుర్తించారు.
అయితే, తమ టీచర్ పరిస్థితిని చూసి చలించిన విద్యార్థులు, పాఠశాల సిబ్బంది సహాయం చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. పెన్షన్ పొందేందుకు దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లను ఇవ్వకపోవడంతో ఆమెకు పెన్షన్ కూడా మంజూరు కాలేదని పాఠశాల సిబ్బంది వెల్లడించారు. తాజాగా ఆమె వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన అధికారులు ఆమెను స్థానిక పోలీస్ స్టేషన్ను తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రభుత్వ మహిళా హోంకు తరలిస్తామని వెల్లడించారు. ఇదిలాఉంటే, తాను వైరాలజీలో పీహెచ్డీ పొందడమే కాకుండా రాష్ట్రస్థాయి క్రీడాకారిణి అని ఇరా బసు చెబుతుండడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం