Delta Variant: 80శాతం కేసులకు ఇదే కారణం..!
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తుపానులా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కొత్తగా నమోదైన 80శాతం పాజిటివ్ కేసులకు డెల్టా వేరియంట్ కారణమని కేంద్ర ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.
ఆల్ఫాతో పోలిస్తే 40-60శాతం అధిక వ్యాప్తి
కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ ఎన్కే అరోరా వెల్లడి
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తుపానులా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కొత్తగా నమోదైన 80శాతం పాజిటివ్ కేసులకు డెల్టా వేరియంట్ కారణమని కేంద్ర ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆల్ఫా వేరియంట్తో పోలిస్తే డెల్టా రకానికి 40 నుంచి 60శాతం అధికంగా వ్యాప్తిచెందే సామర్థ్యం ఉందని తెలిపారు. అయితే, ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్ను సమర్థంగానే ఎదుర్కొంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్ వర్కింగ్ నిపుణులు స్పష్టం చేశారు.
వైరస్ తీవ్రతకు కారణం ఇదే..!
భారత్లో డెల్టా వేరియంట్ (B.1.617.2) గతేడాది అక్టోబర్లో వెలుగు చూసింది. అత్యధిక వ్యాప్తి కలిగిన ఈ వేరియంట్ వల్లే సెకండ్ వేవ్లో 80శాతం కేసులు నమోదైనట్లు కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ ఎన్కే అరోరా పేర్కొన్నారు. స్పైక్ ప్రొటీన్లో మ్యుటేషన్లు కణాల ఉపరితలంపై ఉండే ACE2 రెసెప్టార్లతో బలంగా బంధించేలా దోహదం చేసింది. తద్వారా వైరస్ను విస్తృతంగా వ్యాప్తి చేయడమే కాకుండా శరీర రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగించింది. కేసుల సంఖ్య పెరగడానికి ఈ రకం కారణం అయినప్పటికీ ఇతర వేరియంట్లతో పోలిస్తే దీని తీవ్రత ఎక్కువగా ఉందని కచ్చితంగా చెప్పలేం’ అని ఎన్కే అరోరా పేర్కొన్నారు. అయినప్పటికీ ఊపిరితిత్తుల్లో వాపు వంటి లక్షణాలకు ఇది కారణమైనట్లు తెలుస్తోందని చెప్పారు. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్పై సమర్థంగానే పనిచేస్తున్నట్లు ఐసీఎంఆర్ జరిపిన అధ్యయనాల్లో తేలిందని ఎన్కే అరోరా గుర్తుచేశారు.
కొత్త వేరియంట్లు వస్తే కేసులు పెరుగుతాయ్..
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా కొనసాగుతోందని.. వ్యాక్సినేషన్ పెంచడం, కొవిడ్ నిబంధనలు పాటించడం వంటి చర్యలవల్ల మూడో ముప్పును ఆలస్యం చేయవచ్చని ఎన్కే అరోరా పేర్కొన్నారు. కొత్త వేరియంట్లు వెలుగు చూస్తున్నా కొద్దీ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఇలాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 10 జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ల సహాయంతో వాటి తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రతినెల 50వేల శాంపిళ్లకు సీక్వెన్సింగ్ చేపడుతున్నామన్నారు. ఇందుకోసం దేశంలో మొత్తం జిల్లాలను 180-190 క్లస్టర్లుగా విభజించి ర్యాండమ్ పద్ధతిలో కరోనా బాధితుల స్వాబ్ నమూనాలను సేకరిస్తున్నామని ఎన్కే అరోరా తెలిపారు.
11రాష్ట్రాల్లో డెల్టా ప్లస్..
డెల్టా తర్వాత వెలుగు చూసిన డెల్టా ప్లస్ రకం భారత్లో ఇప్పటికే 11 రాష్ట్రాల్లో విస్తరించిందని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ ఎన్కే అరోరా వెల్లడించారు. ఇప్పటివరకు 55 నుంచి 60కేసులు గుర్తించామన్నారు. ఈరకం వైరస్ వ్యాప్తి సామర్థ్యం, వ్యాక్సిన్ నుంచి తప్పించుకునే లక్షణాలపై అధ్యయనం జరుగుతోందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం