Fourth Dose: నాలుగో డోసుకు సిద్ధమవుతోన్న ఇజ్రాయెల్..!
ప్రపంచంలో వ్యాక్సిన్ పంపిణీలో అందరికన్నా ముందున్న ఇజ్రాయెల్ మాత్రం అవసరమైతే నాలుగో డోసు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.
ఇన్ఫెక్షన్ రేటు పెరుగుతోన్న నేపథ్యంలో అప్రమత్తం
జెరుసలెం: కరోనా వైరస్ను ఎదుర్కొనే వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా దేశాలు మాత్రం వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని సంపన్న దేశాలు ఇప్పటికే బూస్టర్ డోసు పంపిణీ మొదలుపెట్టగా మరికొన్ని దేశాలు మూడో డోసు అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో వ్యాక్సిన్ పంపిణీలో అందరికన్నా ముందున్న ఇజ్రాయెల్ మాత్రం అవసరమైతే నాలుగో డోసు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం తగినన్ని వ్యాక్సిన్ డోసులను సమీకరించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ వెల్లడించింది.
‘నాలుగో డోసు ఎప్పటినుంచి ఇస్తామనే విషయం ప్రస్తుతానికి తెలియదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆరు నెలల్లోపు ఉంటుందని అనుకోవడం లేదు. మూడో డోసు ఎక్కువ రోజులు పనిచేస్తుందని భావిస్తున్నాం. ముందుజాగ్రత్తగా నాలుగో డోసు కోసం వ్యాక్సిన్ సేకరించే పనిలో నిమగ్నమయ్యాం’ అని ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ నాచ్మన్ యాష్ పేర్కొన్నారు. గతకొద్ది రోజులుగా దేశంలో ఇన్ఫెక్షన్ రేటు పెరుగుతోన్న నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.
టీకా తీసుకున్నా ఇన్ఫెక్షన్ రేటు అధికం..
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో ముందున్న ఇజ్రాయెల్లో దాదాపు ఎక్కువ భాగం ఫైజర్ వ్యాక్సిన్ను పంపిణీ చేస్తున్నారు. అక్కడ దాదాపు అర్హులందరికీ (70లక్షల మందికి) తొలి రెండు డోసులు అందించారు. ఆగస్టు నెలలో బూస్టర్ డోసు పంపిణీ కూడా ప్రారంభించారు. ఇవి కూడా దాదాపు 28లక్షల మందికి అందించింది. అయితే, అక్కడ 90శాతం మంది రెండు డోసులు తీసుకున్నప్పటికీ సెప్టెంబర్ తొలివారంలో భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, ప్రపంచంలో ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉన్న దేశాల్లో ఇజ్రాయెల్ అగ్రస్థానంలో నిలిచింది. ముందు తీసుకున్న డోసుల వల్ల వృద్ధిచెందే యాంటీబాడీలు కొన్ని నెలల్లోనే క్షీణిస్తాయని వస్తోన్న నివేదికల నేపథ్యంలో మూడో డోసు పంపిణీ చేపట్టామని అక్కడి ఆరోగ్యశాఖ చెబుతోంది. ఇదే సమయంలో అవసరమైతే నాలుగో డోసు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది.
ఇక బూస్టర్ డోసు వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సుముఖంగా లేదు. కేవలం దీర్ఘకాలిక రోగులకు, వృద్ధులకు అవసరమైతే ఇవ్వాలని మాత్రమే సూచిస్తోంది. అయినప్పటికీ అమెరికా, బ్రిటన్తో పాటు పలు యూరప్ దేశాలు మూడో డోసును అందించేందుకు సిద్ధమయ్యాయి. కొవిడ్ టీకాల ఉత్పత్తి, పంపిణీలను తమ గుప్పిట్లో పెట్టుకున్న సంపన్న దేశాలు, అక్కడి కంపెనీలు పేద దేశాల ప్రజలను నిర్లక్ష్యం చేస్తామంటే ఊరుకునేది లేదని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధోనామ్ ఈమధ్యే పేర్కొన్నారు. కనీసం పేద దేశాలు వ్యాక్సిన్ పొందేనాటికైనా.. ఆయా దేశాలు మూడో డోసు పంపిణీ చేపట్టవద్దని పిలుపునిచ్చారు. అయినప్పటికీ పలు దేశాలు మాత్రం బూస్టర్ డోసుల పంపిణీకి మొగ్గుచూపుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం