Vaccination: దేశంలో 86శాతం మందికి తొలి డోసు పూర్తి..!
దేశంలో కొవిడ్ టీకా తీసుకునేందుకు అర్హులైన (18ఏళ్లకు వయసు పైబడిన) వారిలో 86శాతం మందికి తొలిడోసు అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీవయ పేర్కొన్నారు.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
దిల్లీ: దేశంలో కొవిడ్ టీకా తీసుకునేందుకు అర్హులైన (18ఏళ్లకు వయసు పైబడిన) వారిలో 86శాతం మందికి తొలిడోసు అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీవయ పేర్కొన్నారు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలతో పోలిస్తే మనదేశంలో వ్యాక్సిన్ పంపిణీ వేగంగా కొనసాగుతోందన్నారు. సాధ్యమైనంత త్వరలోనే 100శాతం అర్హులకు తొలి డోసు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మన్సుఖ్ మాండవీయ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ సమాధానం ఇచ్చారు.
‘ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 131కోట్ల డోసులు పంపిణీ చేశాం. వీటిలో 80కోట్ల మంది (86శాతం) అర్హులకు తొలిడోసు అందించగా.. 47.91కోట్ల మందికి (51.0శాతం) రెండు డోసులు పూర్తయ్యాయి. త్వరలోనే 100శాతం అర్హులకు టీకా ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రాల దగ్గర 7 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు కలుగుతాయంటూ వచ్చే వార్తలపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి’ అని మన్సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు.
59 దేశాల్లో ఒమిక్రాన్..
ఇక ఒమిక్రాన్పై మాట్లాడిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి.. ఇప్పటివరకు దేశంలో 23 కేసులు నమోదయినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 59 దేశాల్లో ఈ వేరియంట్ వెలుగు చూసిందన్న ఆయన.. ఈ వేరియంట్ను వ్యాక్సిన్లు ఏ మేరకు ఎదుర్కొంటున్నాయనే విషయంపై ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. వాటి ఫలితాలు వచ్చిన తర్వాతే కొత్త వేరియంట్పై టీకాల సామర్థ్యంపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు.
దేశవ్యాప్తంగా 36 జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లు ఉన్నాయని.. వీటికి 30వేల పరీక్షలు చేపట్టే సామర్థ్యం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. వీటితో పాటు ప్రైవేటు ల్యాబ్ల సహాయంతో ఈ సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇక బూస్టర్ డోసు అవసరమా? లేదా? అనే విషయంపై కసరత్తు జరుగుతోందని.. ఇందులో భాగంగా నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI), నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్లు (NEGVAC) చర్చలు జరుపుతున్నాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం