Tillu Tajpuriya murder: గ్యాంగ్స్టర్ హత్య.. జైల్లో ఆ నాలుగు కత్తులు ఎక్కడివి..?
గ్యాంగ్స్టర్ టిల్లు తాజ్పురియా (Tillu Tajpuriya) హత్య (Murder) నేపథ్యంలో తిహాడ్ జైలు సిబ్బందిపై దిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. దాడికి అడ్డుకునేందుకు అధికారులు, సిబ్బంది ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించింది.
తిహాడ్ జైలు అధికారులకు కోర్టు ప్రశ్న
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని తిహాడ్ జైల్లో (Tihar Jail) గ్యాంగ్స్టర్ టిల్లు తాజ్పురియా (Tillu Tajpuriya) హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు.. జైలు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. దాడికి అడ్డుకునేందుకు జైలు సిబ్బంది ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించింది. జైల్లోకి నాలుగు కత్తులు ఎలా వచ్చాయని అడిగింది. (Gangster Tillu Tajpuriya Murder)
తిహాడ్ జైలులో మే 2వ తేదీన తేజ్పురియాను తోటి ఖైదీలు, మరో గ్యాంగ్స్టర్ గోగి ముఠా సభ్యులు అతడిని దారుణంగా పొడిచి చంపిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన దిగ్భ్రాంతికర దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వగా.. ఆ వీడియోలు ఇటీవల సోషల్మీడియాలో చక్కర్లు కొట్టాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన టిల్లు (Tillu Tajpuriya)ను జైలు సిబ్బంది తీసుకువస్తుండగా.. నిందితులు మరోసారి అతడిపై దాడి చేశారు. ఆ సమయంలో జైలు సిబ్బంది వారిని అడ్డుకోకపోవడం ఆ వీడియోల్లో కన్పించింది. దీనిపై సిబ్బంది విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే టిల్లు (Tillu Tajpuriya) హత్యపై అతడి తండ్రి, సోదరుడు హైకోర్టు (Delhi High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని వారు అభ్యర్థించారు. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు.. జైలు అధికారులు, సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ‘‘సీసీటీవీ దృశ్యాలను మేం పరిశీలించాం. ఆ వీడియో జైల్లోనిదే అయితే.. దాడికి అడ్డుకునేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించలేదు..? హత్య జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదు..? ఇలాంటి ప్రవర్తన ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఇదీ చదవండి: పోలీసుల కళ్ల ముందే దాడి.. 90 కత్తిపోట్లు
ఇక, దాడి తర్వాత జైల్లో లభ్యమైన నాలుగు కత్తులు ఎక్కడి నుంచి వచ్చాయని కోర్టు ప్రశ్నించింది. దానిపై అఫిడవిట్ సమర్పించాలని తిహాడ్ జైలు అధికారులను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 25వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున జైలు సూపరిండెంట్ కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది. అంతేగాక, టిల్లు తండ్రి, సోదరుడికి భద్రత కల్పించాలని పోలీసులను (Delhi Police) ఆదేశించింది. టిల్లు హత్య నేపథ్యంలో పోలీసులపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన అధికారులు.. హత్య సమయంలో తిహాడ్ జైల్లో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు తమిళనాడు స్పెషల్ పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ