Triplets: ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు.. ఒకే కాన్పులో మరో ముగ్గురు మగపిల్లలు

రాజస్థాన్‌లో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలకు జన్మినిచ్చింది. అప్పటికే ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా.. మగపిల్లాడి కోసం ప్రయత్నిస్తున్న ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు.

Updated : 22 Dec 2022 09:23 IST

రాజస్థాన్‌లో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలకు జన్మినిచ్చింది. అప్పటికే ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా.. మగపిల్లాడి కోసం ప్రయత్నిస్తున్న ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. దుంగార్పూర్‌ జిల్లాకు చెందిన జయంతిలాల్‌, బడి దంపతుల సంతానం ఇపుడు ఆరుకు చేరింది. హీరకేడి పిండవాల్‌ ప్రాంతంలో నివాసం ఉండే బడికి నెలలు నిండటంతో నవంబర్‌ 26న.. సగ్వారాలోని పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చేర్పించారు. ముగ్గురు మగపిల్లలు ఒక్కొక్కరు కేవలం కిలో బరువుతో పుట్టారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది ఎదురవడంతో కృత్రిమంగా ఆక్సిజను అందించారు. పాలు తాగేందుకూ వీలుపడక పైపులు అమర్చి పాలు అందించినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.తల్లీబిడ్డలు ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని