US Visa: అమెరికా జోరు..! గతేడాది భారతీయులకు 14 లక్షల వీసాలు
2023లో భారతీయులకు రికార్డు స్థాయిలో 14 లక్షల వీసాలు జారీ చేసినట్లు అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.
దిల్లీ: గతేడాది భారతీయులకు రికార్డు స్థాయిలో 14 లక్షల వీసాలు (US Visas to Indians) జారీ చేసినట్లు అమెరికా వెల్లడించింది. అన్ని వీసా విభాగాల్లో డిమాండ్ భారీగా ఉందని, 2022తో పోలిస్తే గతేడాది భారతీయుల వీసా దరఖాస్తుల్లో 60 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మంది అమెరికా వీసా దరఖాస్తుదారుల్లో ఒకరు భారతీయులేనని పేర్కొంది. విజిటర్ వీసా అపాయింట్మెంట్ నిరీక్షణ సమయాన్ని 75 శాతం (సగటున 1000 రోజుల నుంచి 250కి) తగ్గించినట్లు దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) ఓ ప్రకటనలో వెల్లడించింది.
- భారత్లోని అమెరికా దౌత్య బృందం 2023లో 1.40 లక్షలకుపైగా విద్యార్థి వీసాలు జారీ చేసి.. వరుసగా మూడో ఏడాది రికార్డు సృష్టించింది. మరే దేశంలోనూ ఈ స్థాయిలో జారీ చేయలేదు.
- విద్యార్థి వీసా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ముంబయి, దిల్లీ, హైదరాబాద్, చెన్నైలు ప్రపంచంలోనే మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తోన్న పది లక్షల మందికిపైగా విదేశీ విద్యార్థుల్లో నాలుగింట ఒకవంతు భారతీయులే.
- భారతీయులు, వారి కుటుంబ సభ్యుల కోసం గతేడాది 3.80 లక్షల ఉద్యోగ వీసాలు జారీ. విజిటర్ వీసాల(బీ1/బీ2)కు సంబంధించి మొత్తం 7 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.
- కొవిడ్ మహమ్మారి కారణంగా ఆలస్యమైన 31 వేలకుపైగా వలస వీసా దరఖాస్తులను ముంబయిలోని కాన్సులేట్ జనరల్ పరిష్కరించింది.
- గతేడాది మార్చిలో హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ కార్యకలాపాలను స్థానికంగా 340 మిలియన్ డాలర్లతో నిర్మించిన సొంత భవనంలోకి మార్చారు. అహ్మదాబాద్, బెంగళూరులో కొత్త కాన్సులేట్లను ప్రకటించారు.
హెచ్-1బీ వీసాదారులకు అమెరికాలోనే రెన్యువల్.. కానీ..!
వినూత్న సాంకేతిక పరిష్కారాలు, సిబ్బంది పెంపు, మౌలిక సదుపాయాల కల్పన, మరిన్ని నిధుల కేటాయింపు వంటి చర్యల ద్వారా భారతీయుల వీసా డిమాండ్లను తీర్చినట్లు అమెరికా రాయబార కార్యాలయం వివరించింది. 2024లో హెచ్1బీ వీసాల రెన్యువల్ ప్రక్రియను తమ పైలట్ కార్యక్రమం మరింత సులభతరం చేస్తుందని పేర్కొంది. కొన్ని కేటగిరీల హెచ్-1బీ వీసాలను అమెరికాలోనే పునరుద్ధరించుకునేలా ఓ పైలట్ ప్రోగ్రామ్ను అమెరికా ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!