Amul: అమూల్ బేబీ ఏడుస్తోంది.. మళ్లీ రావా డాచున్హా..!
అమూల్ గర్ల్ కార్టూన్ సృష్టికర్త సిల్వస్టర్ డాచున్హా (Sylvester daCunha) మృతిపై సామాజిక మాధ్యమాల్లో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మళ్లీ రావాలంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: ‘అమూల్’.. (Amul) ఈ పేరు చెప్పగానే ఓ చిన్న పాపాయి కార్టూన్ గుర్తుకు వస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ‘అమూల్ గర్ల్’ (Amul girl) రూపకర్త డాచున్హా కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సిల్వెస్టర్ డాచున్హా (sylvester dacunha) మంగళవారం కన్నుమూశారు. దీంతో ఆయన కార్టూన్లకు ఫిదా అయిన చాలా మంది సామాజిక మాధ్యమాల్లో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ‘అమూల్ బేబీ ఏడుస్తోంది.. మళ్లీ రావా’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ‘అట్టర్లీ-బట్టర్లీ’ (Utterly Butterly) ప్రచారంతో 1966లో తొలిసారిగా ఆయన అమూల్ గర్ల్ కార్టూన్ను గీశారు. అప్పటి నుంచి దీనికి ఎంతో పేరు వచ్చింది.
ఈ ఆలోచన అప్పటిదే..
ప్రకటనల సంస్థ ‘ఏఎస్పీ’లో మేనేజర్గా ఉన్న సమయంలో డాచున్హా అమూల్ కార్టూన్ను గీశారు. నిజానికి ఆ ఆలోచన ఆయన సతీమణి నిషా డాచున్హా తీసుకొచ్చారట. ఆమె ‘అట్టర్లీ అమూల్’ అని ప్రతిపాదించగా.. డాచున్హా దానికి ‘బట్టర్లీ’ అనే పదాన్ని జత చేశారట. అమూల్ ట్యాగ్లైన్ ‘అట్టర్లీ బట్టర్లీ అమూల్’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పట్లో అమూల్ మిల్క్ ప్యాకెట్లు, వెన్నను మాత్రమే ఉత్పత్తి చేసే ఈ సంస్థ క్రమంగా అన్ని పాల ఉత్పత్తుల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తొలినాళ్లలో డాచున్హా ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, విజువలైజర్, కార్టూనిస్ట్ యూస్టేస్ ఫెర్నాండెజ్తో కలిసి పని చేశారు. అలా పని చేస్తున్నప్పుడే ఆయనకు ఈ ఆలోచన వచ్చిందట.. తెల్లటిగౌనుపై ఎర్రటి చుక్కలు, ఎర్రటి బూట్లు, మ్యాచింగ్ రిబ్బన్లు, పెద్దకళ్లతో ఓ కార్టూన్ గీశారట. ఆ తర్వాత దానిని భారీ కటౌట్లు, వాల్పోస్టర్ల రూపంలో ప్రదర్శించడంతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
సొంతంగా అడ్వర్టైజ్ ఏజెన్సీని ప్రారంభించి..
1969లో డాచున్హా సొంతంగా ‘డాచున్హా కమ్యూనికేషన్స్’ పేరుతో అడ్వర్టైజ్ ఏజెన్సీని ప్రారంభించారు. పార్టీ, పత్నీ/వాహ్?, బ్రిటిష్ ఎయిర్వేస్, బోమ్ బై’ తదితర కార్టూన్లు విశేష ఆదరణ పొందాయి. అమూల్ తన వ్యాపారాన్ని విస్తరించిన తర్వాత తన ప్రకటనల కోసం ప్రింట్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకుంది. దీంతో కార్టూన్లకు విశేష ఆదరణ లభించింది. వాటిలో కొన్ని ఇప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సందర్భానుసారంగా పత్రికల్లో అమూల్ గర్ల్ కార్టూన్లను ఇవ్వడం డాచున్హా ప్రత్యేకత. ఉదాహరణకు 2008లో భారత్ చంద్రయాన్-1 మిషన్ను చేపట్టినప్పుడు ‘చార్చంద్ లగ్ గయే’ పేరుతో కార్టూన్ గీశారు. అంతేకాకుండా జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు ‘యూనియన్ కి హర్ టెర్రిటొరీ మే’ పేరుతో కార్టూన్లను అమూల్ ప్రచురించింది.
2011లో స్టీవ్జాబ్స్ మృతి చెందిన సమయంలో ‘యాపిల్ ప్రధాన వ్యక్తిని కోల్పోయింది’ అంటూ కార్టూన్ ప్రత్యక్షమైంది. సందర్భానికి అతికినట్టుగా ఇలాంటి ఎన్నో రూపొందించిన డాచున్హా.. ఇకలేరన్న వార్తతో ఆయన అభిమానుల గుండెలు బరువెక్కుతున్నాయి. అమూల్ బేబీ ఏడుస్తోంది. మళ్లీ రావా అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఆయన విశేషాలతో ‘బీక్యూ ప్రైమ్’ ట్విటర్లో పోస్టు చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. డాచున్హాకు భార్య నిషాతో పాటు కుమారుడు రాహుల్ డాచున్హా ఉన్నారు. ఆయనకు ‘ఎడ్వర్టైజింగ్ గురు’గా పేరుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
Swati Maliwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?