కంటతడి పెట్టించిన రాకింగ్ రాకేశ్
‘జబర్దస్త్’ కేవలం నవ్వించడమే కాదు... మనుషుల మనసులు మారేలా భావోద్వేగమైన స్కిట్లు కూడా వేస్తుంటారు. అందులో సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న
హైదరాబాద్: ‘జబర్దస్త్’ కేవలం నవ్వించడమే కాదు... మనుషుల మనసులు మారేలా భావోద్వేగమైన స్కిట్లు కూడా వేస్తుంటారు. అందులో సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంటారు. నవ్వుతూ, నవ్విస్తూ.. ఆఖరున ఇచ్చే సందేశం ఆలోచింపజేయకుండా ఎందుకు ఉంటుంది. వచ్చేవారం ‘ఎక్స్ట్రా జబర్దస్త్’లో కూడా ఇలాంటి ఓ స్కిట్ రాబోతోంది. పిల్లలతో స్కిట్లు వేస్తూ నవ్వించే రాకేశ్... ఈసారి పంటలతో స్కిట్ వేశాడు. చేతికొచ్చిన పంట, అకాల వర్షం కారణంగా నష్టపోతే ఆ రైతు పడే ఆవేదనను చూపించాడు. ఇది చూసి షోలో జడ్జిలు కళ్లలో నీళ్లు తిరిగాయి.
చాలా రోజుల తర్వాత రష్మీ - సుధీర్ కలసి ఓ స్కిట్ వేయబోతున్నారు. ‘మగధీర’కు స్పూఫ్గా ఈ స్కిట్ ఉండబోతోంది. ఇందులో సుధీర్ ‘ఖాళీ బీరువా’ (కాలభైరవకు స్పూఫ్)గా కనిపించబోతున్నాడు. రష్మి ఇత్తడి బిందె (మిత్రవిందకు స్పూఫ్)గా కనిపించబోతోంది. మరి గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్ ఎలా కనిపిస్తారనేది ప్రోమో చూస్తే తెలుస్తుంది. రష్మీ - సుధీర్ ఓ పాటకు డ్యాన్స్ వేశారు కూడా. జీవన్ స్కిట్లో భాగంగా రిత్విక పంచులతో కడుపుబ్బా నవ్వించింది. బుల్లెట్ భాస్కర్, కెవ్వు కార్తీక్ స్కిట్లు ఆకట్టుకోనున్నాయి. ఈ నవ్వుల వినోదాన్ని ఆస్వాదించేందుకు వచ్చే శుక్రవారం (డిసెంబర్ 4)న ప్రసారం కానున్న ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ చూడాల్సిందే..! కాసేపు నవ్వుకోవాలంటే ప్రోమో చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.