ఆ రాత్రి సుశాంత్ సోదరితో గొడవ జరిగింది
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య చేసుకోవడానికి అతడి స్నేహితురాలు రియా చక్రవర్తి కూడా ఒక కారణమని ఆయన కుటుంబ సభ్యులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన
అప్పటి నుంచి ఆ ఫ్యామిలీతో నేను సరిగా మాట్లాడటం లేదు: రియా చక్రవర్తి
ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య చేసుకోవడానికి అతడి స్నేహితురాలు రియా చక్రవర్తి కూడా ఒక కారణమని ఆయన కుటుంబ సభ్యులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ నుంచి రూ.15కోట్లు రియా చక్రవర్తి తీసుకున్నట్లు ఆయన తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి తన లాయర్లతో కలిసి ఒక ప్రకటన విడుదల చేసింది. సుశాంత్ నుంచి నగదు తీసుకున్నట్లు ఆయన కుటుంబం చేస్తున్న ఆరోపణలను అందులో ఖండించింది. అసలు తనకు ఆ కుటుంబంతో పరిచయం పెద్దగా లేదని స్పష్టం చేసింది.
‘‘కొన్నేళ్లుగా రియా, సుశాంత్లు ఒకరికొకరు తెలుసు. ఒకే ఇండస్ట్రీలో పనిచేస్తుండటంతో ఇద్దరి మధ్యా స్నేహం ఉంది. అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లు. ఏప్రిల్ 2019లో జరిగిన ఓ పార్టీకి కలిసి హాజరయ్యారు. అప్పటి నుంచి ఇద్దరూ డేటింగ్లో ఉన్నారు. డిసెంబరు 2019 నుంచి ఇద్దరూ బాంద్రాలో కలిసి జీవించడం మొదలు పెట్టారు. జూన్ 8, 2020న సుశాంత్ ఇంటి నుంచి రియా వెళ్లిపోయింది. ప్రస్తుతం సుశాంత్ కుటుంబం చేస్తున్న ఆరోపణలు అర్థరహితం. అవన్నీ కల్పితాలు. ముంబయి పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రియా ఆర్థిక లావాదేవీలను పరిశీలించాయి. సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి ఆమెకు ఎలాంటి లావాదేవీలు జరగలేదు. రియా ఆదాయపుపన్ను వివరాలను కూడా పోలీసుల, ఈడీ పరిశీలించారు. చట్ట ’వ్యతిరేకంగా ఎలాంటి అవతకతవకలు కనిపించలేదు’’
‘‘సుశాంత్తో పరిచయమైన తొలి రోజుల్లో సుశాంత్ ఇంటికి రియా వెళ్లారు. అప్పుడు సుశాంత్ తన సోదరి ప్రియాంక, ఆమె భర్త సిద్ధార్థ్లతో కలిసి ఉండేవారు. ఒకరోజు జరిగిన పార్టీలో ప్రియాంక అతిగా మద్యం సేవించారు. మరుసటి రోజు షూటింగ్ ఉండటంతో రియా... సుశాంత్ గదికెళ్లి నిద్రపోయింది. అర్ధరాత్రి లేచి చూసే సరికి ప్రియాంక తన పక్కన ఉండటంతో రియా ఆశ్చర్యపోయింది. వెంటనే ఆమెను నిద్రలేపి ఆ గది నుంచి వెళ్లిపోమన్నది చెప్పింది. ఇదే విషయాన్ని రియా.. సుశాంత్కు చెప్పగా, వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటి నుంచి సుశాంత్ కుటుంబంతో రియా సత్సంబంధాలు సరిగా లేవు’’
‘‘ఈ ఏడాది జూన్లో సుశాంత్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ముంబయి నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నానని, ఎవరినైనా వచ్చి కలవమని చెప్పాడు. దీంతో ఆయన సోదరి మీతూ వస్తానని చెప్పడంతో తన ఫ్లాట్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా సుశాంత్.. రియాను కోరాడు. తనకు ఇష్టం లేకపోయినా, సుశాంత్ సోదరి వస్తోందన్న కారణంగా రియా కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు రియా డాక్టర్ సుశాన్ వాకర్ వద్ద థెరపీ తీసుకుంది. రియా ఎప్పుడూ ఆదిత్య ఠాక్రేను కలవలేదు. కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు. శివసేన నాయకుడిగా మాత్రమే ఆదిత్య ఆమెకు తెలుసు’’ అని రియా న్యాయవాదులు ఆమె తరఫున ప్రకటన విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు