విజయ్ సలహాలు అంతవరకే!
ఇలాంటి పాత్రలే చెయ్యాలి అని నన్ను నేను ఒక చట్రంలో బంధించుకోవాలి అనుకోవట్లేదు. విభిన్న పాత్రలు, వైవిధ్యభరితమైన కథలు చెయ్యాలని ఉంది’’ అంటున్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా నటించిన ‘మిడిల్క్లాస్ మెలోడీస్’ మరి కొన్నిరోజుల్లో ప్రేక్షకుల ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది....
‘‘ఇలాంటి పాత్రలే చెయ్యాలి అని నన్ను నేను ఒక చట్రంలో బంధించుకోవాలి అనుకోవట్లేదు. విభిన్న పాత్రలు, వైవిధ్యభరితమైన కథలు చెయ్యాలని ఉంది’’ అంటున్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా నటించిన ‘మిడిల్క్లాస్ మెలోడీస్’ మరి కొన్నిరోజుల్లో ప్రేక్షకుల ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తన సినీ ప్రయాణం గురించి ఆనంద్ పంచుకున్న సరదా సంగతులివీ..
‘మిడిల్ క్లాస్ మెలోడీస్’లో రాఘవ అనే మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తా. గుంటూరులో టిఫిన్ సెంటర్ పెట్టి.. జీవితంలో స్థిరపడాలనే లక్ష్యంగా జీవిస్తుంటా. కానీ, దీనికి కావాల్సిన డబ్బుండదు. ఈ క్రమంలో నా లక్ష్యాన్ని సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశా? ఎదురైన సవాళ్లేంటి? అన్నది మిగతా కథ. మధ్యతరగతి జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది. ‘దొరసాని’ షూటింగ్ టైంలోనే దర్శకుడు వినోద్ నాకీ కథ చెప్పారు. విన్న వెంటనే నాకు తెగ నచ్చేసింది. స్క్రిప్ట్ చదివాక.. మధ్యతరగతి జీవితాలు కళ్ల ముందు కదిలినట్లుగా అనిపించింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు ఎంతో చక్కగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. దీంట్లో వినోదం కథలో భాగంగా ఉంటుంది కానీ, ఎక్కడా ఇరికించినట్లు ఉండదు.
గుంటూరు యాస కోసం కష్టపడ్డా..
ఈ చిత్రంలోని నా పాత్ర.. నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. చిన్నప్పుడు మేమూ మధ్యతరగతి కష్టాలు చాలా చూశాం. కథ వింటున్నప్పుడు అవన్నీ మళ్లీ గుర్తొచ్చాయి. ఈ చిత్రంలో గుంటూరు యాసలో మాట్లాడటం కోసం కష్టపడ్డా. నిజానికి ఈ చిత్రాన్ని థియేటర్లే లక్ష్యంగా తెరకెక్కించాం. డిసెంబరు నాటికే చిత్రీకరణ పూర్తయింది. వేసవిలో థియేటర్లలోకి తీసుకొద్దాం అనుకున్నాం. కానీ, కరోనా పరిస్థితులతో అనూహ్యంగా మా ప్రయాణం ఓటీటీ వైపు మలుపు తీసుకుంది. అమెజాన్ ద్వారా విడుదల కావడం వల్ల తెలుగు వాళ్లతో 190 దేశాల ప్రజలు చూడగలిగే అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉంది.
చాలా విషయాలు చెబుతుంటాడు
నేనేదైనా కథ వింటే.. ‘ఫలానా దర్శకుడు కథ చెప్పాడు.. లైన్ ఇది’ అని ఒక ఫ్రెండ్కి చెప్పినట్లు విజయ్కి చెప్తా. అది అంతవరకే. తర్వాత తను ఏమన్నా చెప్పాలనుకుంటే సినిమా చూశాకే చెప్తాడు. ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో.. నటన పరంగా నేనింకేం చెయ్యొచ్చు.. ఇలా చిన్న చిన్న విషయాలు చెప్తుంటాడు. తనకి ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చాలా నచ్చింది.
అది భవిష్యత్తులో నెరవేరొచ్చేమో..
విజయ్, నేను కలిసి చేస్తే బాగుంటుందని ఇంట్లో వాళ్లు, బయట చాలా మంది అనుకుంటారు. మేమైతే ఎప్పుడూ దాని గురించి మాట్లాడుకోలేదు. మంచి కథ దొరికితే భవిష్యత్తులో చెయ్యొచ్చేమో. కానీ, అదంత ఈజీగా అయిపోదు. ఒకవేళ మేం చెయ్యాల్సి వచ్చినా.. అన్నదమ్ముల్లాగే చెయ్యాల్సి వస్తుందేమో. ఎందుకంటే మా ఇద్దరి రూపు, మాటతీరు ఒకేలా ఉంటాయి.
కొత్త సినిమా కబుర్లు..
ప్రస్తుతం సృజన్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నా. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే నిర్మాణాంతర పనులు మొదలవుతాయి. ఇప్పుడప్పుడే వెబ్సిరీస్ల వైపు వెళ్లే ఆలోచన లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.