Aadi saikumar: ప్రేమ కురిసే సమయానికే...!

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా విజన్‌ సినిమాస్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తీస్‌మార్‌ఖాన్‌’. పాయల్‌ రాజ్‌పూత్‌ కథానాయిక. సునీల్, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కల్యాణ్‌ జి.గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. డా.నాగం తిరుపతిరెడ్డి నిర్మాత. సమయానికే...

Updated : 07 Dec 2022 15:23 IST

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా విజన్‌ సినిమాస్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తీస్‌మార్‌ఖాన్‌’. పాయల్‌ రాజ్‌పూత్‌ కథానాయిక. సునీల్, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కల్యాణ్‌ జి.గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. డా.నాగం తిరుపతిరెడ్డి నిర్మాత. సమయానికే... అంటూ సాగే ఈ సినిమాలోని రెండో గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. రాకేందు మౌళి రచించిన ఈ పాటని శ్రుతి ఆలపించారు. సాయికార్తీక్‌ స్వరాలు సమకూర్చారు. ‘‘యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. స్టూడెంట్, రౌడీ, పోలీస్‌... ఇలా మూడు రకాల పాత్రలో సందడి చేయనున్న ఆది సాయికుమార్‌ ఈ సినిమా కోసం తన శరీరాకృతిని మార్చుకున్నారు. పాయల్‌ రాజ్‌పూత్‌తో ఆయన కెమిస్ట్రీ బాగుంటుంది. రెండోపాటకి ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. ఆగస్టు 19న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నాయి సినీవర్గాలు.  ఇందులో అనూప్‌సింగ్‌ ఠాకూర్, కబీర్‌సింగ్‌ తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని