Cannes 2022: అనారోగ్యంతో కేన్స్‌కి దూరమైన బాలీవుడ్‌ స్టార్‌ హీరో

చలనచిత్ర రంగంలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే ‘కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ మరికొన్నిరోజుల్లో ఫ్రాన్స్‌లో ప్రారంభం కానుంది. బాలీవుడ్‌, దక్షిణాది పరిశ్రమలకు చెందిన పలువురు...

Published : 15 May 2022 10:34 IST

ముంబయి: చలనచిత్ర రంగంలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే ‘కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ మరికొన్నిరోజుల్లో ఫ్రాన్స్‌లో ప్రారంభం కానుంది. బాలీవుడ్‌, దక్షిణాది పరిశ్రమలకు చెందిన పలువురు స్టార్‌హీరో హీరోయిన్లు, మ్యూజిక్‌ డైరెక్టర్లు ఈ ఏడాది భారత్‌ తరఫున ‘కేన్స్‌’లో సందడి చేయనున్నారు. ఇదిలా ఉండగా, అనారోగ్యం కారణంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఈ వేడుకలకు దూరమయ్యారు. ఈ విషయాన్ని తాజాగా ఆయన ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. కేన్స్‌కు వెళ్లేందుకు కరోనా పరీక్షలు చేయించుకోగా.. అక్షయ్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఫ్రాన్స్‌ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు.

ప్రస్తుతానికి తనకి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. విశ్రాంతి తీసుకుని త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానంటూ అక్షయ్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా, రెడ్‌ కార్పెట్‌పై మెరవనున్న ఇతర భారత నటీనటులు, బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. ఇక, భారత్‌ తరఫు నుంచి ఈ ఏడాది కేన్స్‌లో పాల్గొనేవారిలో ఏఆర్‌ రెహమాన్‌ (అంతర్జాతీయ సంగీత దర్శకుడు), మామ్‌ ఖాన్ ‌(జానపద గాయకుడు), నవాజుద్దీన్‌ సిద్ధిఖీ (నటుడు), నయనతార (నటి), పూజాహెగ్డే (నటి), ప్రసూన్‌ జోషి (సీబీఎఫ్‌సీ ఛైర్మన్‌), మాధవన్‌ (నిర్మాత), రిక్కీ కేజ్‌ (మ్యూజిక్‌ డైరెక్టర్‌), శేఖర్‌ కపూర్‌ (నిర్మాత, దర్శకుడు), తమన్నా (నటి), వాణీ త్రిపాఠి (నటి) ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని