‘దృశ్యం2’ పూర్తి  

మెరుపు వేగంతో సినిమాని పూర్తి చేశారు వెంకటేష్‌. ఆయన కథానాయకుడిగా ‘దృశ్యం2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విజయ వంతమైన ‘దృశ్యం’కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమిది. ఈసారి మాతృకని తెరకెక్కించిన...

Updated : 16 Apr 2021 08:47 IST

మెరుపు వేగంతో సినిమాని పూర్తి చేశారు వెంకటేష్‌. ఆయన కథానాయకుడిగా ‘దృశ్యం2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విజయ వంతమైన ‘దృశ్యం’కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమిది. ఈసారి మాతృకని తెరకెక్కించిన మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్‌యే తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి భాగం సినిమాలో నటించిన మీనా, నదియా, నరేష్‌ తదితర తారాగణమే ఇందులోనూ నటిస్తోంది. మార్చి 5న సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. వెంకటేష్‌పై తెరకెక్కించాల్సిన సన్నివేశాలు పూర్తయినట్టు చిత్రబృందం ప్రకటించింది. వెంకటేష్‌ ఇప్పటికే ‘నారప్ప’ సినిమాని కూడా దాదాపుగా పూర్తి చేశారు. ‘నారప్ప’, ‘దృశ్యం2’... ఇలా ఆయన వరుసగా రెండు సినిమాలతో సందడి చేస్తారన్నమాట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని