సీతారామం.. అందమైన దృశ్య కావ్యం
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం ‘సీతారామం’. అశ్వినీదత్ నిర్మాత. రష్మిక, సుమంత్, గౌతమ్ మేనన్ కీలక పాత్రలు పోషించారు. విశాల్ చంద్రశేఖర్ స్వరాలందించారు.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం ‘సీతారామం’. అశ్వినీదత్ నిర్మాత. రష్మిక, సుమంత్, గౌతమ్ మేనన్ కీలక పాత్రలు పోషించారు. విశాల్ చంద్రశేఖర్ స్వరాలందించారు. ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘‘ఇంతందం దారి మళ్లిందా’’ అనే గీతాన్ని సోమవారం హైదరాబాద్లో విడుదల చేశారు. దుల్కర్, మృణాల్పై రూపొందించిన ప్రేమ గీతమిది. దీనికి కృష్ణకాంత్ సాహిత్యమందించగా.. ఎస్పీ చరణ్ ఆలపించారు. ఈ కార్యక్రమంలో నటి మృణాల్ మాట్లాడుతూ.. ‘‘ఈ పాట విన్న ప్రతిసారీ మనసుకు హాయిగా ఉంటుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అమితంగా ప్రేమిస్తారు. చాలా గొప్ప కథతో రూపొందింది. ప్రతి ఫ్రేమ్ ఒక అందమైన పెయింటింగ్లా ఉంటుంది. దుల్కర్ లేకుంటే ఈ చిత్రం లేదు. తనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం’’ అంది. ‘‘దర్శకుడు హను రాఘవపూడి అచ్చమైన తెలుగు పాటలు రాయిస్తుంటారు. ఈ పాటని 1965 నేపథ్యం ప్రతిబింబించేలా స్వచ్ఛమైన తెలుగు పదాలతో రాయమని చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఈ చిత్రం ఒక అందమైన దృశ్య కావ్యంలా ఉంటుంది’’ అన్నారు గీత రచయిత కృష్ణకాంత్. దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. ‘‘సినిమాలో నాకెంతో ఇష్టమైన పాటిది. చాలా సవాల్తో కూడుకొని ఉంటుంది. దీన్ని కృష్ణకాంత్ అద్భుతంగా రాశారు. పాట విన్నాక వేటూరి గుర్తొచ్చారు. ఈ గీతాన్ని విశాల్ చాలా ఆర్గానిక్గా క్రియేట్ చేశారు. కానీ, రాయడానికి చాలా సమయం పట్టింది. పాటలో దుల్కర్, మృణాల్ చూడముచ్చటగా ఉంటారు’’ అన్నారు. ‘‘గొప్ప సంగీతాభిరుచి ఉన్న దర్శకుడు హను. సినిమాలోని ప్రతిపాట మనసుని హత్తుకునేలాగే ఉంటుంది’’ అన్నారు సంగీత దర్శకుడు విశాల్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు