సంగీత ప్రయాణం
విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చారు మహేష్. ఇటీవలే ఓ ప్రకటన చిత్రీకరణలో పాల్గొన్నారు.
విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చారు మహేష్. ఇటీవలే ఓ ప్రకటన చిత్రీకరణలో పాల్గొన్నారు. తండ్రి సూపర్స్టార్ కృష్ణ మరణంతో విషాదంలో మునిగిపోయిన ఆయన... ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటికొచ్చి కెరీర్పై దృష్టి పెడుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణని త్వరలోనే షురూ చేయడం కోసం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ లోపుగానే సంగీత చర్చలకోసం చిత్రబృందం దుబాయ్ వెళ్లనుంది. మహేష్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ స్వరాలు సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. కథానాయకుడు మహేష్, సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు త్రివిక్రమ్ కలిసి కొన్నాళ్లపాటు దుబాయ్లో గడపనున్నట్టు సమాచారం. ‘అల వైకుంఠపురములో’ తర్వాత త్రివిక్రమ్ - తమన్ కలిసి చేస్తున్న చిత్రమిది. సంగీతం ఆ సినిమా ఫలితంపై గట్టి ప్రభావమే చూపించింది. ఈసారి కూడా సంగీతంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. అభిమానుల్ని అలరించేలా ఇందులో ఓ ప్రత్యేక గీతం కోసం సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వేసవి తర్వాత షురూ?
మహేష్ - రాజమౌళి కలయికలో చిత్రాన్ని పట్టాలెక్కించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయా? వచ్చే వేసవి తర్వాత సినిమా షురూ కానుందా? ఈ ప్రశ్నలకి అవుననే సమాధానలే వినిపిస్తున్నాయి పరిశ్రమ వర్గాలు. ఇప్పటికే ఆ సినిమా కోసం రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ని సిద్ధం చేస్తున్నారు. సాహసోపేతమైన ప్రయాణం నేపథ్యంలో ఆ సినిమా రూపొందుతుందని దర్శకుడు రాజమౌళి ఇదివరకే వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విరామం తర్వాత జూన్లో సెట్లోకి
గతేడాది బ్లాక్బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు