తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం.
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. సాయిరోనక్, ప్రగ్యా నగ్రా జంటగా నటిస్తున్న చిత్రమిది. రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రమేశ్ చెప్పాల దర్శకుడు. వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీభాగం చిత్రీకరణ పూర్తయినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ‘‘తెలుగింట పెళ్లిళ్లలో కనిపించే సంస్కృతి, మర్యాద, సరదాలు ప్రత్యేకం. ఆ విషయాన్ని చాటి చెబుతూనే, మనసుని హత్తుకునే భావోద్వేగాలతో చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. తెలుగుదనం ఉట్టిపడేలా చిత్రం రూపొందుతోంది. చరణ్ అర్జున్ సంగీతం, బాల్రెడ్డి కెమెరా పనితనం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. పాటల చిత్రీకరణతో సినిమా పూర్తవుతుంద’’ని దర్శకనిర్మాతలు తెలిపారు. ఇందులో చక్కటి ప్రేమకథ కూడా ఉందని చెప్పారు నటుడు రాజేంద్రప్రసాద్. ఇందులో కృష్ణుడు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
10న ‘ప్రతినిధి 2’
నారా రోహిత్ కథానాయకుడిగా నటించిన ‘ప్రతినిధి 2’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన చిత్రమిది. కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. విజయవంతమైన ‘ప్రతినిధి’కి కొనసాగింపుగా రూపొందిన చిత్రమిది. నారా రోహిత్ ఓ పాత్రికేయుడిగా కనిపిస్తారు. సిరిలెల్లా కథానాయిక. దినేశ్ తేజ్, సప్తగిరి, జిషుసేన్ గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయభాను, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి.
రాబిన్హుడ్ కా బాప్
భిన్నమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న మనోజ్ బాజ్పేయీ.. త్వరలో ‘భయ్యాజీ’గా తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అపూర్వ సింగ్ కర్కీయే తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ సినీప్రియుల దృష్టిని ఆకర్షించాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని తెలుపుతూ..సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త పోస్టర్ను పంచుకున్నారు మనోజ్. ‘‘త్వరలో రాబిన్ హుడ్ కా బాప్ మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ‘భయ్యాజీ’ ఈ నెల 24న విడుదల కానుంద’’ని వ్యాఖ్యల్ని జోడించారు. ప్రతీకార నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కుటుంబ భావోద్వేగాలు ప్రధానాంశంగా ఉండనున్నాయని తెలిపింది చిత్రబృందం. మనోజ్ భనుషాలీ నిర్మిస్తున్నారు.
క్లాప్ క్లాప్...
డైరెక్టర్స్ డే సందర్భంగా శనివారం రెండు కొత్త సినిమాలు ప్రారంభం అయ్యాయి. ఖుషి టాకీస్ పతాకంపై రోజా ఖుషి, దినేశ్, సుమంత్, అనుపమ ప్రధాన పాత్రధారులుగా ‘సీత ప్రయాణం కృష్ణతో’ తెరకెక్కుతోంది. దేవేందర్ దర్శకత్వం వహిస్తున్నారు. రోజా భారతి నిర్మిస్తున్నారు. ‘త్రిగుణి’ పేరుతో రూపొందుతున్న మరో సినిమాని మహి మీడియా వర్క్స్ పతాకంపై మహేశ్వరి నిర్మిస్తున్నారు. వైతహవ్య వడ్లమాని దర్శకత్వం వహిస్తున్నారు. కుషాల్ కథానాయకుడు. రోజా ఖుషి ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఈ సినిమాల ప్రారంభ సన్నివేశాలకి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్నివ్వగా, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు వేణు ఉడుగుల, నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, డార్లింగ్ స్వామి, రుద్రాపట్ల వేణుగోపాల్, రామ్ రావిపల్లి పాల్గొన్నారు. ‘సీత ప్రయాణం కృష్ణతో’ కడుపుబ్బా నవ్వించే ఓ కుటుంబ కథతో రూపొందుతోందని దర్శకుడు దేవేందర్ తెలిపారు. ‘త్రిగుణి’ ఓ కొత్త ప్రయత్నం అని, కొత్త నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారని తెలిపారు దర్శకుడు వైతహవ్య వడ్లమాని.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
ఓ నెటిజన్ పెట్టిన కామెంట్పై స్పందించిన రేణూదేశాయ్ ‘నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు?’ అని అసహనం వ్యక్తంచేశారు. -
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
రాజమౌళి-మహేశ్ల ప్రాజెక్ట్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్గా మారింది. -
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
24 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఆచూకీ లభించింది. -
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
‘హీరామండి’ చూసిన తర్వాత మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పినట్లు సోనాక్షి సిన్హా తెలిపారు. -
ఆ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటి దీపిక
డెడ్లైన్స్ గ్లోబల్ డిస్రప్టర్స్ అనే హాలీవుడ్ మ్యాగజైన్ ప్రతీ ఏడాది.. ప్రపంచవ్యాప్తంగా వినోదరంగంలో రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నటీనటుల జాబితాను విడుదల చేస్తుంది. ఇటీవలే విడుదల చేసిన ఈ ఏడాది జాబితాలో ప్రముఖ బాలీవుడ్ అగ్రతార దీపికా పదుకొణె చోటు దక్కించుకుంది. -
పేరు అదేనా?
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందనున్న సినిమాపై ఈ నెల 20న మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజైన ఆ రోజున చిత్రబృందం అధికారికంగా సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాల్ని కానీ... పేరుని కానీ వెల్లడించే అవకాశాలున్నాయి. -
సూర్యకు జోడీగా పూజ?
సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 2డి ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూన్ తొలి వారం నుంచి అండమాన్ దీవుల్లో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. -
‘ధురంధర్’.. గ్యాంగ్స్టర్
సంగ్రామ్ భలేరావ్గా ‘సింగమ్ అగైన్’తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రణ్వీర్ సింగ్. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రానున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. రణ్వీర్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. -
ప్రేమ యుద్ధానికి సన్నాహాలు
‘బ్రహ్మాస్త్ర’లో జోడీగా ఆకట్టుకున్నారు బాలీవుడ్ యువజంట రణ్బీర్ కపూర్, అలియా భట్. ఇప్పుడు మరోసారి ‘లవ్ అండ్ వార్’ సినిమాతో అభిమానులను ప్రేమలో పడేయడానికి ముస్తాబవుతోందీ జంట. -
అందర్నీ అలరించే యాక్షన్ చిత్రమిది
శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి నాయకానాయికలుగా ఆడారి మూర్తి సాయి తెరకెక్కించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. జి.ఎస్.బాబు నిర్మించారు. సత్యప్రకాశ్, నాగినీడు, జయశ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘మనం’ ప్రత్యేక ప్రదర్శనలు
మూడు తరాల కథానాయకులు కలిసి చేసిన సినిమాగా... ఏఎన్నార్ చివరి చిత్రంగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ‘మనం’. సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదలై ఈ నెల 23తో పదేళ్లు పూర్తవుతున్నాయి. -
‘కన్నప్ప’లో కాజల్
విష్ణు మంచు కలల చిత్రం ‘కన్నప్ప’కి మరో ఆకర్షణ తోడైంది. ప్రముఖ కథానాయిక కాజల్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఆ విషయాన్ని చిత్రబృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్కుమార్, శరత్ కుమార్ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. -
ఫ్రెంచ్ దర్శకురాలి చిత్రంలో జాకీ ష్రాఫ్
ఎన్నో విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్.. ఇప్పుడు ఓ సరికొత్త సినిమా కోసం అంతర్జాతీయ దర్శకురాలితో చేతులు కలిపారు. నటిగా, దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాండ్రిన్ బొన్నైర్ తెరకెక్కిస్తున్న ‘స్లో జో’ అనే చిత్రంలో జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్లో నటిస్తున్నారు. -
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రసన్నవదనం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
సుహాస్ హీరోగా నటించిన చిత్రం ‘ప్రసన్నవదనం’. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. -
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
‘బుజ్జి’ని పరిచయం చేయబోతున్నానంటూ మరో పోస్ట్ పెట్టారు ప్రభాస్.
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
-
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీ .. ఈసీ ఉత్తర్వులు
-
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు