Balakrishna: సరికొత్త పాత్రలో బాలకృష్ణ
కథానాయకుడు బాలకృష్ణ కొత్త దారుల్లో పయనిస్తున్నారు. తన ప్రతిభను సరికొత్తగా చూపించుకునే అవకాశమున్న ఏ వేదికనూ వదలడం లేదు.
కథానాయకుడు బాలకృష్ణ(Balakrishna) కొత్త దారుల్లో పయనిస్తున్నారు. తన ప్రతిభను సరికొత్తగా చూపించుకునే అవకాశమున్న ఏ వేదికనూ వదలడం లేదు. ఓవైపు వెండితెరపై వరుస విజయాలతో జోరు చూపిస్తున్న ఆయన.. మరోవైపు ‘అన్స్టాపబుల్’ టాక్షోతో డిజిటల్ వేదికపై వ్యాఖ్యాతగానూ మెరుపులు మెరిపించారు. కాగా, ఇప్పుడాయన మరో కొత్త అవతారంలో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తెలుగు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు బాలయ్యతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్టార్ స్పోర్ట్స్ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పెద్ద తెరపై ఐపీఎల్ చూస్తూ సంతోషంగా గడిపిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. మార్చి 31న స్టార్ స్పోర్ట్స్ తెలుగు నిపుణులతో చేతులు కలపనున్నా. ఆ క్షణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ సీజన్ మనందరికీ ప్రత్యేకంగా నిలిచిపోవాలని ఆశిస్తున్నా’’ అన్నారు. ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా ఘనంగా ఆరంభం కానుంది. ప్రారంభ మ్యాచ్లో చెన్నై, గుజరాత్ టైటాన్స్ జట్లు
తలపడనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్