Balakrishna: మల్టీస్టారర్ చిత్రంలో బాలకృష్ణ?
కథానాయకుడు బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ‘ఎన్బికె108’ వర్కింగ్ టైటిల్తో సెట్స్పై ముస్తాబవుతున్న ఈ చిత్రం దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కథానాయకుడు బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ‘ఎన్బికె108’ వర్కింగ్ టైటిల్తో సెట్స్పై ముస్తాబవుతున్న ఈ చిత్రం దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు. బోయపాటి శ్రీను, బాబీ తదితర దర్శకులు ఆయనకు కథలు వినిపించినట్లు ప్రచారం సాగినా దేనిపైనా స్పష్టత రాలేదు. కాగా, బాలయ్య ఇప్పుడు కన్నడ స్టార్ శివ రాజ్కుమార్తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నారని సమాచారం. ఇది రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
తొలి భాగంలో శివ రాజ్కుమార్, బాలకృష్ణ కలిసి నటించనుండగా.. రెండో భాగంలో వీరికి మరో స్టార్ కూడా జత కలవనున్నట్లు తెలిసింది. ఇందుకోసం రజనీకాంత్ పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆయనకు కుదరకుంటే కమల్హాసన్, మమ్ముట్టి, మోహన్లాల్లలో ఒకరిని బరిలోకి దించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్కు హర్ష దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. దీన్ని శివ రాజ్కుమార్ తన సొంత నిర్మాణ సంస్థలో మరో ఇద్దరు కన్నడ నిర్మాతలతో కలిసి నిర్మించనున్నారట. అయితే ఇదే బాలకృష్ణ 109వ చిత్రమవుతుందా? లేక మధ్యలో మరేదైనా సినిమా చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.