NTR: ఎన్టీఆర్ మళ్లీ పుట్టాల్సిందే
‘‘ఆ రోజుల్లో శ్రీదేవితో కలిసి ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటే... ‘ఆహా ఏం చేశారు’ అంటూ వాళ్ల నటనని మెచ్చుకునేవాళ్లే తప్ప, వాళ్ల వయసు గురించి ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు. కేవలం వాళ్ల పాత్రలే తెరపై కనిపించేవి.
‘‘ఆ రోజుల్లో శ్రీదేవితో కలిసి ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటే... ‘ఆహా ఏం చేశారు’ అంటూ వాళ్ల నటనని మెచ్చుకునేవాళ్లే తప్ప, వాళ్ల వయసు గురించి ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు. కేవలం వాళ్ల పాత్రలే తెరపై కనిపించేవి. కానీ ఇప్పుడు సినమా ఓ సర్కస్లా మారింది. విషాదకరమైన పాటల్లోనూ డ్యాన్సులు వేస్తూ కనిపిస్తున్నార’’న్నారు ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు. విఖ్యాత నటులు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఇటీవల హైదరాబాద్లో పలువురు సినీ ప్రముఖులకి ఎన్టీఆర్ మెమోరియల్ పురస్కారాల్ని ప్రదానం చేశారు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్తోపాటు ప్రభ, శివకృష్ణ, రోజారమణి, కవిత, తనికెళ్ల భరణి, బాబు మోహన్, కైకాల నాగేశ్వరరావు, బుర్రా సాయిమాధవ్, కొమ్మినేని వెంకటేశ్వరరావు, గుబ్బా సురేష్కుమార్ తదితర సినీ ప్రముఖుల్ని ఈ వేదికపై సత్కరించారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘రామారావు మళ్లీ పుడితే తప్ప ఈ భూమిపై ఇంకో రామారావు లేరు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్బాబు, కృష్ణ... వీళ్లు ఎంత పారితోషికం తీసుకున్నారనేది ఎవరికైనా తెలుసా? వాళ్లు ఏ రోజూ పారితోషికాల గురించి బాహాటంగా మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు రోజుకి ఇన్ని రూ.కోట్లు తీసుకుంటున్నాం అని చెబుతున్నారు కొంతమంది. ఇది మంచి పద్ధతి కాదు’’ అన్నారు. చిత్ర పరిశ్రమలో నటుల పరిస్థితి గురించి ఆయన మాట్లాడుతూ ఎంతమంది నటులు రెండు పూటలా భోజనం చేస్తున్నారో మా అసోసియేషన్ పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న నటులు బతకలేని పరిస్థితులు ఉన్నాయని, ప్రకటనల్లోనూ స్టార్లే నటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో లొకేషన్లు ఉచితంగా ఇవ్వాలంటూ మా అసోసియేషన్ ప్రభుత్వాలకి లేఖ రాయాలని, అలాంటి ప్రోత్సాహకాలతోనే చిన్న సినిమాలు విరివిగా రూపుదిద్దుకుని, నటులకి ఉపాధి దొరుకుతుందన్నారు. పురస్కారం అందుకున్న పలువురు సినీ ప్రముఖులు ఎన్టీఆర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు గారపాటి లోకేశ్వరి, నందమూరి మోహనకృష్ణ, చైతన్యకృష్ణ, గారపాటి శ్రీనివాస్, నందమూరి యశ్వంత్తోపాటు రిటైర్డ్ ఐ.జి.మాగంటి కాంతారావు, అంబిక కృష్ణ, తుమ్మల ప్రసన్నకుమార్, అనంతపురం జగన్, విష్ణు బొప్పన తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్