Cinema News: ‘జీ2’ సెట్స్‌లోకి బనితా సంధు

అడివి శేష్‌ కథానాయకుడిగా వినయ్‌ కుమార్‌ సిరిగినీడి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘జీ2’. ‘

Updated : 30 Mar 2024 12:12 IST

డివి శేష్‌ కథానాయకుడిగా వినయ్‌ కుమార్‌ సిరిగినీడి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘జీ2’. ‘గూఢచారి’ సినిమాకి కొనసాగింపుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో బనితా సంధు కథానాయిక. ఆమె తాజాగా ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం గుజరాత్‌లోని భుజ్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో శేష్‌, బనితాలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దీంట్లో వీళ్లిద్దరి కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంటుందని.. ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించే లక్ష్యంగా ఈ చిత్రం కోసం పని చేస్తున్నామని చిత్ర వర్గాలు తెలిపాయి. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఇమ్రాన్‌ హష్మి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


‘డియర్‌’ వచ్చేది ఆ రోజే

జి.వి.ప్రకాశ్‌ కుమార్‌, ఐశ్వర్య రాజేశ్‌ జంటగా ఆనంద్‌ రవిచంద్రన్‌ తెరకెక్కించిన చిత్రం ‘డియర్‌’. వరుణ్‌ త్రిపురనేని, అభిషేక్‌ రామిశెట్టి, జి.పృథ్వీరాజ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌, ఏషియన్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా విడుదల చేయనున్నాయి. ఈ విషయాన్ని రెండు నిర్మాణ సంస్థలు శుక్రవారం ప్రకటించాయి. ఈ చిత్ర ఆంధ్ర హక్కుల్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సొంతం చేసుకోగా.. తెలంగాణ హక్కుల్ని ఏషియన్‌ సినిమాస్‌ దక్కించుకుంది. భిన్నమైన కామెడీ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తమిళంలో ఏప్రిల్‌ 11న విడుదల కానుండగా.. తెలుగు వెర్షన్‌ ఏప్రిల్‌ 12న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్‌, ఛాయాగ్రహణం: జగదీశ్‌ సుందరమూర్తి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని