Raashi Khanna: ఎందరికో అది ఓ కల.. వాళ్లలో నేనూ ఉన్నా
దక్షిణాదితోపాటు.. బాలీవుడ్లోనూ వరుస సినిమాలు చేస్తూ తన నటనతో సినీప్రియుల్ని మెప్పిస్తుంది కథానాయిక రాశీ ఖన్నా.
దక్షిణాదితోపాటు.. బాలీవుడ్లోనూ వరుస సినిమాలు చేస్తూ తన నటనతో సినీప్రియుల్ని మెప్పిస్తుంది కథానాయిక రాశీ ఖన్నా. ఇటీవలే ఆమె కీలక పాత్రలో నటించిన ‘యోధ’ విడుదలై విజయాన్ని అందుకుంది. తాజాగా ఈమె ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పనిచేయాలని ఉందంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘‘భన్సాలీ దర్శకత్వంలో నటించాలనేది నా ఎన్నో ఏళ్ల కల. నేను మాత్రమే కాదు.. ప్రతి నటీనటుల జాబితాలో కచ్చితంగా ఉంటారాయన. ఎందుకంటే ఆయన రూపొందించే చిత్రాల్లో స్త్రీలను తనదైన శైలిలో ప్రత్యేకంగా చూపించగల సత్తా ఉన్న దర్శకుడు. తన సినిమాలతో విమర్శకుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేయగలరు. అందుకే భన్సాలీతో పనిచేసే రోజు కోసం ఎదురుచూస్తున్నాను. కరణ్జోహార్తో కూడా కలిసి పనిచేయాలకుంటున్నాన’’ని అంది. ‘ఫర్జీ 2’ గురించి మాట్లాడుతూ..‘‘ఫర్జీ’ సిరీస్ సినీప్రియుల్ని అలరించింది. ఈ సిరీస్ విజయంతో ‘ఫర్జీ 2’ను రూపొందిస్తున్నారు. దీని చిత్రీకరణను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నార’’ని చెప్పుకొచ్చింది రాశి. త్వరలో ఆమె ‘ది సబర్మతీ రిపోర్ట్’తో రావడానికి సిద్ధంగా ఉంది. ఆమె, విక్రాంత్ మాస్సే జంటగా నటించిన ఈ సినిమా టీజర్ను ఇటీవలే విడుదల చేశారు. గోద్రా రైలును తగలబెట్టడం వెనక దాగి ఉన్న రహస్యాలను చూపిస్తూ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది ఈ టీజర్. మే 3న రానుందీ చిత్రం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉన్నతమైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసొస్తున్నాయి
ఎదురు చూపులకి తెర పడింది. ‘కల్కి 2898 ఎ.డి’ విడుదల ఖరారైంది. మేలైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసి వస్తున్నాయంటూ జూన్ 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు శనివారం ప్రకటించాయి. -
ప్రేమ వివాహమే చేసుకుంటా!
‘జాతిరత్నాలు’ చిత్రంతో తొలి అడుగులోనే సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది ఫరియా అబ్దుల్లా. ఇప్పుడామె అల్లరి నరేశ్తో కలిసి ‘ఆ.. ఒక్కటీ అడక్కు’తో అలరించేందుకు సిద్ధమైంది. -
కృష్ణ జయంతికి ‘హరోం హర’
‘హరోం హర’తో సినీప్రియుల్ని పలకరించనున్నారు సుధీర్ బాబు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించారు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. -
‘ప్రేమికుడు’ మళ్లీ వస్తున్నాడు
ప్రభుదేవా - శంకర్ కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘ప్రేమికుడు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని మే 1న రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు రమణ, మురళీధర్ రెడ్డి ప్రకటించారు. -
ఆ లాజిక్తోనే ప్రసన్న వదనం తీశాడు
‘‘నేను తీసిన ‘100%లవ్’ మొదలుకొని నా ప్రతి సినిమాకీ పనిచేశాడు అర్జున్. తను హాలీవుడ్లో ఉండి ఉంటే మరో స్థాయిలో సినిమాలు తీసేవాడు. -
ఈసారి శివాలెత్తిపోద్ది
‘‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. దీని గురించి నేనొక్కటే చెప్తాను. ఈసారి శివాలెత్తిపోద్ది’’ అన్నారు విష్వక్ సేన్. ఆయన హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. -
మూడు జంటల కథ.. ఖేల్ ఖేల్ మే
వినోదాన్ని పంచే ఏ సినిమా కోసమైనా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ జాబితాలోకే చేరే ‘ఖేల్ ఖేల్ మే’ కోసం ఎప్పటినుంచో వేచి చూస్తున్న అభిమానులకు తీపి కబురు వినిపించింది చిత్రబృందం. -
అవి నా జీవితంలో చీకటి రోజులు!
‘‘నా జీవితంలోనే నేను అనుభవించిన ఓ చీకటి దశ ఇద’’ని అంటోంది నాయిక ప్రియాంక చోప్రా. బాలీవుడ్లోనే కాదు.. హాలీవుడ్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. -
తండ్రీ తనయుల సంఘర్షణ
తన కొడుకు ప్రయోజకుడై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించిన ఓ తండ్రి... ‘నాన్నలందరూ ఇంతే, అర్థం చేసుకోర’ంటూ బాధపడే ఓ తనయుడు... -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..