Raashi Khanna: ఎందరికో అది ఓ కల.. వాళ్లలో నేనూ ఉన్నా

దక్షిణాదితోపాటు.. బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ తన నటనతో సినీప్రియుల్ని మెప్పిస్తుంది కథానాయిక రాశీ ఖన్నా.

Updated : 30 Mar 2024 11:55 IST

క్షిణాదితోపాటు.. బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ తన నటనతో సినీప్రియుల్ని మెప్పిస్తుంది కథానాయిక రాశీ ఖన్నా. ఇటీవలే ఆమె కీలక పాత్రలో నటించిన ‘యోధ’ విడుదలై విజయాన్ని అందుకుంది. తాజాగా ఈమె ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీతో కలిసి పనిచేయాలని ఉందంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘‘భన్సాలీ దర్శకత్వంలో నటించాలనేది నా ఎన్నో ఏళ్ల కల. నేను మాత్రమే కాదు.. ప్రతి నటీనటుల జాబితాలో కచ్చితంగా ఉంటారాయన. ఎందుకంటే ఆయన రూపొందించే చిత్రాల్లో స్త్రీలను తనదైన శైలిలో ప్రత్యేకంగా చూపించగల సత్తా ఉన్న దర్శకుడు. తన సినిమాలతో విమర్శకుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేయగలరు. అందుకే భన్సాలీతో పనిచేసే రోజు కోసం ఎదురుచూస్తున్నాను. కరణ్‌జోహార్‌తో కూడా కలిసి పనిచేయాలకుంటున్నాన’’ని అంది. ‘ఫర్జీ 2’ గురించి మాట్లాడుతూ..‘‘ఫర్జీ’ సిరీస్‌ సినీప్రియుల్ని అలరించింది. ఈ సిరీస్‌ విజయంతో ‘ఫర్జీ 2’ను రూపొందిస్తున్నారు. దీని చిత్రీకరణను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నార’’ని చెప్పుకొచ్చింది రాశి. త్వరలో ఆమె ‘ది సబర్మతీ రిపోర్ట్‌’తో రావడానికి సిద్ధంగా ఉంది. ఆమె, విక్రాంత్‌ మాస్సే జంటగా నటించిన ఈ సినిమా టీజర్‌ను ఇటీవలే విడుదల చేశారు. గోద్రా రైలును తగలబెట్టడం వెనక దాగి ఉన్న రహస్యాలను చూపిస్తూ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది ఈ టీజర్‌. మే 3న రానుందీ చిత్రం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని