Pragya jaiswal: కోల్పోయిన అవకాశం తిరిగొచ్చింది

‘ఎవరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన చిత్రంలోనే భాగమయ్యే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటోంది ప్రగ్యా జైస్వాల్‌.

Updated : 06 May 2024 09:50 IST

వరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన చిత్రంలోనే భాగమయ్యే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటోంది ప్రగ్యా జైస్వాల్‌. ‘కంచె’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ కథానాయిక ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ‘ఖేల్‌ ఖేల్‌ మే’లో కీలక పాత్ర పోషిస్తోంది. ఆయనతో కలిసి నటించిన అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రేక్షకులతో పంచుకుంది. ‘2014లో అక్షయ్‌ సర్‌ ప్రధాన పాత్రలో తెలుగు దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ చిత్రానికి ఆడిషన్‌ ఇచ్చా. కొన్ని కారణాల వల్ల అందులో నటించే అవకాశం రాలేదు. దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు ఆయన హీరోగా రానున్న ‘ఖేల్‌ ఖేల్‌ మే’లో కీలక పాత్ర పోషిస్తున్నా. ఇన్నాళ్లకు మళ్లీ ఆ అవకాశం రావడం యాదృచ్ఛికం. ఆయనతో తెర పంచుకోవడం గర్వంగా ఉంది. ఈ ప్రాజెక్టు నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు సరైన పాత్ర లభించిందని సంతోషపడ్డా. కానీ ఆయనతో నటించడం అనగానే మొదట్లో చాలా భయపడ్డా. కొద్ది రోజులకి ఆయన దగ్గరికి వెళ్లి నన్ను నేను పరిచయం చేసుకున్నా. ఆయన ఎంతో ప్రోత్సహించారు’ అని చెప్పుకొచ్చింది ప్రగ్యా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని