prashanthi harathi: నటిగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టా
నటనపై తనకున్న ప్రేమ... ఆసక్తే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తనని తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చేలా చేసిందన్నారు ప్రశాంతి హారతి. వివాహం, కుటుంబ బాధ్యతల వల్లే ఇరవయ్యేళ్లుగా నటనకు దూరం కావల్సి వచ్చిందన్నారామె.
నటనపై తనకున్న ప్రేమ... ఆసక్తే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తనని తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చేలా చేసిందన్నారు ప్రశాంతి హారతి. వివాహం, కుటుంబ బాధ్యతల వల్లే ఇరవయ్యేళ్లుగా నటనకు దూరం కావల్సి వచ్చిందన్నారామె. ‘ఇంద్ర’ సినిమాలో ముంతాజ్గా, ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాలో సునీల్ భార్యగా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రశాంతి హారతి. ‘ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్’, ‘రూపాయి’తోపాటు పలు చిత్రాల్లోనూ, ధారావాహికల్లోనూ నటించారు. కూచిపూడి నృత్య కళాకారిణి అయిన ప్రశాంతి... పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే కూచిపూడి డ్యాన్స్ స్కూల్స్ని నిర్వహిస్తున్నారు. నటిగా రోండో ఇన్నింగ్స్ని మొదలు పెట్టానంటూ ఆమె మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ‘‘చిన్నప్పుడు నృత్యమే నాకు ప్రపంచం. నృత్య ప్రదర్శనలు, ఫొటో మోడలింగ్ వల్ల సినిమా రంగం నుంచి అవకాశాలొచ్చాయి. అలా అనుకోకుండానే చిత్ర పరిశ్రమకి వచ్చి గుర్తింపు తెచ్చుకున్నా. ఇంతలో పెళ్లి నా నట ప్రయాణాన్ని మలుపు తిప్పింది.
సినీ రంగాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవడం బాధగా అనిపించింది. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు, పిల్లల్ని చూసుకుంటూనే ఆమెరికాలో నృత్య పాఠశాలల్ని నిర్వహించా. నటనపై నాకున్న మక్కువని గమనించిన నా భర్త, నా పిల్లలు మళ్లీ సినిమా కెరీర్ని పునః ప్రారంభించాలని ప్రోత్సహించారు. మా అమ్మాయి తాన్య హారతితో కలిసి వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో తెలుగింటి సంస్కృతి పేరుతో ఓ వీడియో చేశా. దర్శకుడు కె.రాఘవేంద్రరావు యూ ట్యూబ్ ఛానల్లో విడుదల చేశారు. దానికి మంచి స్పందన వచ్చింది. గతంతో పోలిస్తే చిత్ర సీమలో చాలా మార్పులొచ్చాయి. సినిమాలతోపాటు, వెబ్ సిరీస్లు, టెలివిజన్ షోలు ఎంతో ప్రభావం చూపిస్తున్నాయి. కథలో ప్రాధాన్యమున్న పాత్రలొస్తే ఎక్కడి నుంచి అవకాశాలొచ్చినా చేయడానికి సిద్ధమే. గతంలో కె.విశ్వనాథ్ సినిమాలు చూసి ఎంతో స్ఫూర్తి పొందుతూ మన సంప్రదాయ కళల్ని ముందు తరాలకి చేర్చాం. అలా స్ఫూర్తినిచ్చే సినిమాలు, సిరీస్లు ఇప్పుడు కూడా రావల్సిన అవసరం ఉంది’’ అని చెప్పారు ప్రశాంతి హారతి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు