Bollywood: ఆ చేదు జ్ఞాపకాలకు నిదర్శనాలెన్నో?

‘‘రెండో ప్రపంచ యుద్ధం గురించి వింటూ ఉంటే... ఎంతో ఉత్కంఠగా, ఆసక్తిగా ఉంది’’ అంటోంది జాన్వికపూర్‌. ఆమె వరణ్‌ధావన్‌తో కలసి నటిస్తున్న చిత్రం ‘బేవాల్‌’. నితీష్‌ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ యూరప్‌లో జరుగుతోంది.

Updated : 14 Jul 2022 07:47 IST

‘‘రెండో ప్రపంచ యుద్ధం గురించి వింటూ ఉంటే... ఎంతో ఉత్కంఠగా, ఆసక్తిగా ఉంది’’ అంటోంది జాన్వికపూర్‌ (Janhvi Kapoor). ఆమె వరణ్‌ధావన్‌తో(Varun Dhawan) కలసి నటిస్తున్న చిత్రం ‘బేవాల్‌’ (BAWAAL). నితీష్‌ తివారి(Nitesh Tiwari) తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ యూరప్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా చిత్రబృందం ఇటీవల పోలెండ్‌ వెళ్లింది. వరుణ్‌, జాన్వి ఇద్దరూ టూరిస్ట్‌ల్లా మారి అక్కడ ఉన్న ఓ నాజీ క్యాంప్‌ను సందర్శించారు. జాన్వి అక్కడి అనుభవాలను పంచుకుంటూ... ‘రెండో ప్రపంచ యుద్ధం ఎంత   భీకరంగా జరిగిందో? ఎంత ప్రాణ నష్టం జరిగిందో   తెలుసుకుంటూ ఉంటే ఒళ్లు గగొర్పుడుస్తోంది. నాజీలు, యూదుల మధ్య పోరు ఎలా ఉండేదో ఇక్కడ ఆడియోల రూపంలో విన్నా. అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసేందుకు క్యాంప్‌లో ఎన్నో నిదర్శనాలున్నాయి. ఈ పర్యటన నిజంగా ఎంతో ఆసక్తికరంగా ఉంది’’ అంటూ చెప్పుకొచ్చింది. సాజిద్‌ నడియద్‌వాలా నిర్మిస్తున్న ‘బేవాల్‌’ చిత్రీకరణ ఆగస్టు మొదటి వారం వరకూ ఇక్కడే సాగనుంది. ఈ సినిమా 2023 ఏప్రిల్‌ 7న    ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. జాన్వి నటించిన తాజా చిత్రం ‘గుడ్‌లక్‌ జెర్రీ’ డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ నెల 29న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు