Kangana Ranuat: కొత్తతరం సినిమా పేరుతో చెత్త అమ్మకండి: కంగన
కొత్తతరం సినిమా పేరుతో దయచేసి చెత్త అమ్మకండి అని అంటున్నారు నటి కంగనా రనౌత్. బాలీవుడ్కు చెందిన పలువురు నటీనటులు, నిర్మాతలపై తరచూ ఆగ్రహం వ్యక్తం చేసే కంగన తాజాగా మరోసారి దీపిక...
దీపిక చిత్రంపై నటి పరోక్ష విమర్శలు
ముంబయి: కొత్తతరం సినిమా పేరుతో దయచేసి చెత్త అమ్మకండి అంటున్నారు నటి కంగనా రనౌత్. బాలీవుడ్కు చెందిన పలువురు నటీనటులు, నిర్మాతలపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కంగన తాజాగా మరోసారి దీపిక సినిమాపై కామెంట్ చేశారు. ఇన్స్టా స్టోరీస్ వేదికగా దీపిక నటించిన ‘గెహ్రాహియా’పై స్పందించారు. కొత్తతరం ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో దీపిక-సిద్ధాంత్ చతుర్వేదిల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కాస్త మితిమీరాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంగన.. 1965లో విడుదలైన ‘హిమాలయ్ కీ గాడ్ మే’లోని ఓ పాటను ట్యాగ్ చేస్తూ..
‘‘నేను కూడా కొత్తతరానికి చెందిన మహిళనే కానీ, ఈ పాటలో చూపించిన రొమాన్సే.. నిజమైన రొమాన్స్గా భావిస్తున్నా. అంతేకానీ కొత్తతరం, అర్బన్ సినిమా పేరుతో దయచేసి చెత్త అమ్మకండి. చెడ్డ సినిమాలు ఎప్పటికీ చెడ్డ సినిమాలే. స్కిన్ షో చేసినంత మాత్రాన అవి మంచివి కాలేవు. అందరికీ తెలిసిన ప్రాథమిక సత్యమిది. ‘గెహ్రాహియా’ వాళ్లకు తెలియలేదా?’’ అని ఆమె రాసుకొచ్చారు. షకున్ బత్రా దర్శకత్వం వహించిన ‘గెహ్రాహియా’ అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు