CASH: జాగ్రత్తగా ఉన్నా కరోనా వచ్చింది: అభి

సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్‌టైన్‌మెంట్‌ గేమ్‌ షో ‘క్యాష్‌ దొరికినంత దోచుకో’. తాజాగా ఈ షోలో బుల్లితెర తారలు హిమజ, అదిరే...

Published : 13 Jun 2021 18:01 IST

హైదరాబాద్‌: సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్‌టైన్‌మెంట్‌ గేమ్‌ షో ‘క్యాష్‌: దొరికినంత దోచుకో’. తాజాగా ఈ షోలో బుల్లితెర తారలు హిమజ, అదిరే అభి, రోల్‌ రైడా, మహేశ్‌ విట్టా.. వాళ్ల అక్కాచెల్లెళ్లతో పాల్గొని సరదాగా సందడి చేశారు. అభిపై సుమ వేసే పంచులు నవ్వులు పూయించేలా ఉన్నాయి. సరదాగా సాగుతున్న షోలో.. కరోనా కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేసి అభి ఉద్వేగానికి లోనయ్యారు. ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ తాను కరోనా బారిన పడ్డానని.. అదే సమయంలో తన చెల్లి దుబాయ్‌ నుంచి భారత్‌కు వచ్చిందని.. 15 రోజులపాటు తనని జాగ్రత్తగా చూసుకుందని అభి చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ చూడాలంటే జూన్‌ 19 వరకూ వేచి చూడాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని